ఇబ్రహీంపట్నంరూరల్, ఏప్రిల్ 8 : మైనార్టీల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో శనివారం రాత్రి నిర్వహించిన ఇఫ్తార్విందు కార్యక్రమానికి ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి హాజరయ్యారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్పర్సన్ కప్పరి స్రవంతి, మైనార్టీ నాయకులు గౌస్పాషాతో పాటు తదితరులు పాల్గొన్నారు.
కడ్తాల్ : మత సామరస్యానికి ఇఫ్తారు విందులు ప్రతీకగా నిలుస్తాయని మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ఎంబీఏ గార్డెన్స్లో వైస్ ఎంపీపీ ఆనంద్ ముస్లింలకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో హిందూ, ముస్లింలు ఇఫ్తార్ విందులో పాల్గొంటూ సోదరభావాన్ని చాటుకుంటారని తెలిపారు. ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పండుగలను జరుపుకోవాలని సూచించారు. మసీద్లో ముస్లింలకు పండ్లు తినిపించి ఉపవాసాలను విరమింపజేశారు.
అంతకుముందు కడ్తాల్ ఎంపీటీసీ శ్రీనివాస్రెడ్డి కుటుంబాన్ని స్థానిక నాయకులతో కలిసి జైపాల్యాదవ్ పరామర్శించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ దశరథ్నాయక్, కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం, పీఏసీఎస్ చైర్మన్ వెంకటేశ్గుప్తా, మాజీ సర్పంచ్ లక్ష్మీనర్సింహారెడ్డి, నాయకులు శ్రీనివాస్యాదవ్, శ్రీనివాస్రెడ్డి, వీరయ్య, రామకృష్ణ, గంప శ్రీను, రాజేందర్యాదవ్, రామచంద్రయ్య, సైదులు, వెంకటేశ్, రాఘవేందర్, గణేశ్, మసీద్ కమిటీ అధ్యక్ష, ఉపాధ్యక్షులు అబ్దుల్ రవూఫ్, అహ్మద్జానీ, జావిద్, ఇమామ్ జహీరుద్దీన్, జహంగీర్అలీ, లాయక్అలీ, ఇర్షాద్, గౌస్, రబ్బానీ, కరీం, యూనుస్ పాల్గొన్నారు.
పెద్దఅంబర్పేట : మున్సిపాలిటీ పరిధి తట్టిఅన్నారంలో కౌన్సిలర్ దేవిడి గీతా వేణుగోపాల్రెడ్డి ఆధ్వర్యంలో ముస్లింలకు ఆదివారం రాత్రి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ముస్లిం పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఇఫ్తార్ విందును ఆరగించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ సంపూర్ణారెడ్డి, నాయకులు విజయ్శేఖర్రెడ్డి, వేణుగోపాల్రెడ్డి, నిఖిల్, అలీ పాల్గొన్నారు.
షాబాద్ : కులమతాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి ఉండాలని టీపీసీసీ కార్యదర్శి పీసరి సురేందర్రెడ్డి అన్నారు. సోమవారం రాత్రి మండలంలోని నాగరగూడ పీఎస్ఆర్ గార్డెన్లో మైనార్టీలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ఇఫ్తార్ విందులు మతసామరస్యానికి ప్రతీకలుగా నిలుస్తాయన్నారు. పవిత్ర రంజాన్మాసంలో మైనార్టీ సోదరులు ఉపవాస దీక్షలు చేపట్టడం గొప్ప పరిణామమన్నారు. కార్యక్రమంలో మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.