షాబాద్, ఫిబ్రవరి 4: అనారోగ్యంతో వారం రోజులుగా హైదరాబాద్లోని సోమాజిగూడ యశోదా దవాఖానలో చికిత్స పొందుతున్న చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి, ఉమ్మడి రంగారెడ్డిజిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ పట్నం మహేందర్రెడ్డి ఆదివారం వేర్వేరు సమయాల్లో దవాఖానకు వెళ్లి పరామర్శించారు.
ఆరోగ్య పరిస్థితిపై ఇరువురు వైద్యులతో మాట్లాడారు. ఎమ్మెల్యే యాదయ్య త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వారివెంట మొయినాబాద్ జడ్పీటీసీ కాలె శ్రీకాంత్, నాయకులు కృష్ణగౌడ్ తదితరులు ఉన్నారు.