బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమవుతున్నదని, మరింత ప్రగతి జరుగాలంటే వచ్చే ఎన్నికల్లోనూ గులాబీ పార్టీని గెలిపించాలని ఎమ్మెల్యేలు కిషన్రెడ్డి, అంజయ్య యాదవ్ అన్నారు. బుధవారం ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని ఖానాపూర్ 10వ వార్డుకు చెందిన కాంగ్రెస్ కౌన్సిలర్ శంకరయ్యతోపాటు ఆ పార్టీ నాయకులు, అలాగే నందిగామ మండలం బండోనిగూడ గ్రామ కాంగ్రెస్ వారి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈసందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ప్రజలందరూ బీఆర్ఎస్వైపే ఉన్నారని, ఏదేమైనా హ్యాట్రిక్ ఖాయమన్నారు.
ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 6 : ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మరింత అభివృద్ధ్ది సాధించాలంటే బీఆర్ఎస్తోనే సాధ్యమని, వచ్చే ఎన్నికల్లో కూడా అభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కరూ బీఆర్ఎస్ను గెలిపించాలని ఎమ్మెల్యే కిషన్రెడ్డి అన్నారు. బుధవారం ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని ఖానాపూర్ 10వ వార్డుకు చెందిన కాంగ్రెస్ కౌన్సిలర్ శంకరయ్య క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఇబ్రహీంపట్నం నియోజకవర్గం గతంలో ఎన్నడూలేని విధంగా బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధిలో దూసుకుపోతున్నదన్నారు. పెద్ద ఎత్తున పరిశ్రమలు రావటం వల్ల నియోజకవర్గంలో భూముల ధరలు కూడా గణనీయంగా పెరిగాయని, స్థానిక నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కూడా లభిస్తున్నాయని అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం కూడా ఈ నియోజకవర్గానికే రావటంతో నియోజకవర్గం అభివృద్ధిలో ఎంతో ముందంజలో ఉందన్నారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ కూడా అభివృద్ధి పనులు వేగవంతం చేయటానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి, ఎంపీపీ కృపేశ్, బీఆర్ఎవ మున్సిపల్ అధ్యక్షుడు అల్వాల వెంకట్రెడ్డి, ప్రధాన కార్యదర్శి మడుపు వేణుగోపాల్రావు, బీఆర్ఎస్ నాయకులు కొండ్రు ప్రవీణ్, యాచారం రవీందర్, బర్తాకి రాజు, కానుగుల మహేశ్, మహేందర్, రాజు తదితరులు పాల్గొన్నారు.
నందిగామ : ప్రజలంతా బీఆర్ఎస్ వైపే ఉన్నారని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. మండలంలోని బండోనిగూడ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో బుధవారం బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా బీఆర్ఎస్ అవతరించిందన్నారు. సంక్షేమ పథకాల అమలుతో దేశం మొత్తం తెలంగాణ వైపే చూస్తుందన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పద్మారెడ్డి, సర్పంచ్ జట్టకుమార్, నాయకులు ఆంజనేయులు, స్వామలయ్య, నర్సింహ్మ, పాండు, శ్రీను, రవీందర్ పాల్గొన్నారు.