మంచాల, జనవరి 11: ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పనిచేస్తుందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. బుధవారం మంచాల మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే కిషన్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 30మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిషన్రెడ్డి మాట్లాడుతూ మంచాల మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 1640మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ నర్మద, జిల్లా గ్రంథాలయ చైర్మన్ సత్తువెంకట రమణారెడ్డి, ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ చైర్మన్ ఏర్పుల చంద్రయ్య, సహకార సంఘం చైర్మన్ బి.పుల్లారెడ్డి, తహసీల్దార్ అనిత, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
గ్రంథాలయాల వ్యవస్థ బలోపేతం
తెలంగాణలో గ్రంథాలయ వ్యవస్థను బలోపేతం చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మంచాల మండలం కేంద్రంలో రూ. 33లక్షల వ్యయంతో నిర్మిస్తున్న గ్రంథాలయ భవన నిర్మాణ పనులను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం గ్రామీణ గ్రంథాలయాలను అద్భుతంగా తీర్చిదిద్దడమే కాక పాఠకులకు అవసరమైన పుస్తకాలన్నిటినీ సమకూర్చుతున్నదని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి మనోజ్కుమార్, సర్పంచ్ జగన్రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.
క్రీడాకారుల అభ్యున్నతికి ప్రభుత్వం ప్రాధాన్యం
ఆదిబట్ల, జనవరి 11: ప్రభుత్వం క్రీడాకారుల అభ్యున్నతికి ప్రాధాన్యత కల్పిస్తున్నదని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. బుధవారం ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని బొంగుళూరు వద్ద సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఇబ్రహీంపట్నం మండలంలోని 14 గ్రామ పంచాయతీల పరిధిలో బూడిద నందారెడ్డి, బూడిద రాంరెడ్డి ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా విచ్చేసి ఈ టోర్నమెంట్ను ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రంలో క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ప్రతి గ్రామంలో క్రీడాప్రాంగణాలు ఏర్పాటు చేసిందని అన్నారు. అదే విధంగా నియోజకవర్గంలోని అబ్దుల్లాపూర్మెట్, కొంగరకలాన్ గ్రామాల్లో 5 ఎకరాల్లో క్రీడాప్రాంగణాలు ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు క్యామ మల్లేశ్, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, ఎంపీపీ పి.కృపేశ్, సహకార సంఘం జిల్లా వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య, బీఆర్ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షుడు కొప్పు జంగయ్య, పార్టీ మండల అధ్యక్షుడు చిలుకల బుగ్గరాములు, సహకార సంఘం చైర్మన్లు బి. వెంకట్రెడ్డి, మహేందర్రెడ్డి, సర్పంచులు గీతారాంరెడ్డి, కవిత, చిలుకల యాదగిరి, బీఆర్ఎస్ నాయకులు కె.జంగయ్య, పైళ్ల తిరుమల్రెడ్డి, జె. రాజు, పాతూరి ప్రవీణ్, ఎంపీటీసీ భరత్కుమార్రెడ్డి, నారని సుధాకర్ పాల్గొన్నారు.