ఇబ్రహీంపట్నం, ఆగస్టు 24 : కొంగరకలాన్లో నిర్మించిన కలెక్టర్ కార్యాలయం ప్రారంభోత్సవంతో పాటు జరుగనున్న బహిరంగసభకు జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున హాజరవ్వాలని ఎమ్మెల్యేకిషన్రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ కొంగరకలాన్లో అత్యాధునిక వసతులతో నిర్మాణం పూర్తిచేసుకున్న జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయాన్ని మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభిస్తారని తెలిపారు. అనంతరం బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నామన్నారు. సభకు సీఎంతో పాటు పలువురు మంత్రులు హాజరవుతున్నారని వెల్లడించారు.
ఆమనగల్లు :ఇబ్రహీంపట్నం మండలం కొంగరకలాన్లో గురువారం రంగారెడ్డి జిలా ్లసమీకృత కలెక్టర్ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభ ను విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు.ఆమనగల్లు పట్టణంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 50 వేల మందితో భారీ బహిరంగ సభ ఉంటుందన్నారు. సమావేశంలో వస్పుల జంగయ్య, అల్లాజీ, విజయ్, శివలింగం, శ్రీను, విజయ్రాథోడ్, శేఖర్, సుక్క వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
తుర్కయాంజాల్ : సీఎం కేసీఆర్ సభకు కార్యకర్తలు కదలాలని డీసీసీబీ వైస్ చైర్మన్ సత్తయ్య అన్నారు. బ్రహ్మణపల్లిలో ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో వంగేటి లక్ష్మారెడ్డి, కల్యాణ్ నాయక్, సంజీవరెడ్డి, అమరేందర్రెడ్డి, వెంకటేశ్, లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.
చేవెళ్లటౌన్ : నూతన కలెక్టర్ కార్యాలయ ప్రారంబోత్సవానికి పెద్ద ఎత్తున తరలాలని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ప్రభాకర్ తెలిపారు. మండలం నుంచి 8 వేల మందిని తరలిస్తున్నామని తెలిపారు.
మంచాల : సీఎం సభకు పెద్ద ఎత్తున కదలాలని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చీరాల రమేశ్ అన్నారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా నూతన కలెక్టరేట్ను ఏర్పాటు చేయడం ప్రజల అదృష్టం అని అన్నారు. బహిరంగ సభకు కార్యకర్తలు, నాయకులు, అభిమానులు హాజరవ్వాలన్నారు.
అబ్దుల్లాపూర్మెట్ : కలెక్టర్ కార్యాలయం ప్రారంభం తో పాటు సీం సభను విజయవంతం చేయాలని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కొత్త కిషన్గౌడ్ అన్నారు. మండల కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశంలో ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ లెక్కల విఠల్రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి కోట వెంకట్రెడ్డి, మాజీ అధ్యక్షుడు పూజారి చక్రవర్తిగౌడ్, నాయకులు ఎండీ చాంద్పాషా, రాధాకృష్ణ, ఏసూరి శేఖర్, దూసరి యాదయ్య, బుర్ర జ్ఞానేశ్వర్గౌడ్ పాల్గొన్నారు.
తలకొండపల్లి : మండలంలోని 32 గ్రామాలకు చెందిన టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై సభను విజయవంతం చేయాలని జడ్పీ కోఆప్షన్ సభ్యులు రహమాన్, మాజీ ఎంపీపీ శ్రీనివాస్యాదవ్ కోరారు. సమావేశంలో శ్రీకాంత్, దస్తగిరి, రాజు, అభిలాష్, పరందాములు, సాయి తదితరులు పాల్గొన్నారు.
షాబాద్ : సీఎం కేసీఆర్ సభను విజయవంతం చేయాలని టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గూడూర్ నర్సింగ్రావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం మధ్యాహ్నం 2గంటలకు కొంగరకలాన్లో నూతనంగా నిర్మించిన జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఉదయం 11గంటలకు మండల కేంద్రంలో జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డి ఆధ్వర్యంలో తరలివెళ్లే కార్యక్రమానికి మండలంలోని 41 గ్రామ పంచాయతీల నుంచి టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి సీఎం సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు.