ఆమనగల్లు, ఫిబ్రవరి 16 : కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ఢీ-82 కాల్వల పనులను పూర్తి చేసి నిర్ణీత ఆయకట్టుకు సాగునీరు అందించా లని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి శుక్రవారం అసెంబ్లీలో కోరారు. అదేవిధంగా వె ల్డండ, ఆమనగల్లు, మాడ్గుల మండలాల్లోని 35వేల ఎకరాలకు సాగునీరు అందించేందు కు 2017లో ఢీ-82 కాల్వల పనులను చేపట్టారని.. వెల్దండ మండలంలోని చెర్కూర్ వద్ద ఓ రైతు పొలానికి పరిహారం అందకపోవడంతో 2018లో ఈ పనులను నిలిపేశారని ఆయన సభ దృష్టికి తెచ్చారు. కాల్వల నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు వెం టనే పరిహారాన్ని చెల్లించాలన్నారు.
ఆమనగల్లు ప్రభుత్వ దవాఖానను 100 పడకలకు పెంచి ఆధునాతన భవనాన్ని నిర్మించాలని.. ఆమనగల్లు ప్రభుత్వ జూనియర్ కళాశాల భవన నిర్మాణానికి గత ప్రభుత్వం రూ. 1.50 కోట్లు కేటాయించగా పనులు సగానికి పూర్తి కాగా భూవివాదం కారణంగా కేసు కోర్టులోకి వెళ్లిందని.. విద్యార్థుల భవితను దృష్టిలో ఉంచుకుని ఆ సమస్యలను వెంటనే పరిష్కరించి భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. స్పందించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రస్తావించిన సమస్యలను సంబంధిత శాఖల దృష్టికి తీసుకెళ్లి త్వరగా పరిష్కారమయ్యేలా చూస్తానన్నారు.
షాద్నగర్, ఫిబ్రవరి 16 : పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా చౌదరిగూడ మండలంలోని లక్ష్మీదేవిపల్లి ప్రాంతంలో నిర్మించనున్న రిజర్వాయర్తోనే షాద్నగర్ నియోజకవర్గం సస్యశ్యామలవుతుందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించారు. శుక్రవారం నియోజకవర్గంలో నెలకొన్న సాగు, తాగునీటి సమస్యలపై ప్రభుత్వానికి వివరించారు.
పాలమూరు ఎత్తిపోతల పథకంలో భా గంగా లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్కు నిధులు కేటాయించి నిర్మాణం చేపడితేనే ఈ ప్రాంత రైతులు, ప్రజలకు లా భం కలుగుతుందని వివరించారు. షాద్నగర్లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపు నిబంధనలు ఏ విధంగా ఉండాలో తెలుపుతూ పేదలకు ఇండ్లను పంపిణీ చేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన బిల్లుకు ఆమోదం తెలుపడం సంతోషకరమని అన్నారు.