అగ్ర కథానాయకుడు రామ్చరణ్ మణికట్టు సర్జరీ నిమిత్తం కోయంబత్తూరు పయనమయ్యారు. అక్కడి గంగా ఆసుపత్రిలో ఆయనకు సర్జరీ జరుగనున్నది. ప్రత్యేక వైద్య నిపుణులు ఈ సర్జరీని నిర్వహించనున్నారు. ‘పెద్ది’ సినిమా షూట్లో రామ్చరణ్ మణికట్టుకు గాయమైన విషయం తెలిసిందే.
అయినప్పటికీ ఆ సినిమా ప్రచార కార్యక్రమాల్లో ధాటిగా పాల్గొన్నారాయన. సర్జరీ సమయంలో రామ్చరణ్కు తోడుగా ఆయన సతీమణి ఉపాసనతోపాటు తల్లిదండ్రులు సురేఖ, చిరంజీవి కూడా కోయంబత్తూరు వెళ్లినట్టు సమాచారం.