చేవెళ్ల రూరల్, ఏ్రపిల్ 17 : అర్హులైన నిరుపేదలందరికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. గురువారం చేవెళ్లలోని కేజీఆర్ గార్డెన్లో నియోజకవర్గానికి సంబంధించి ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కాలె యాదయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభించిందన్నారు. ఇందిరమ్మ కమిటీ సభ్యులు అర్హులైన పేదలకు ఇండ్లు ఇచ్చే విధంగా కృషి చేయాలని అన్నారు.
ప్రజలు ఎలాంటి అపోహలకు లోను కావొద్దని అర్హులందరికి ఇండ్లు వచ్చేలా పారదర్శకంగా వ్యవహరిస్తామన్నారు. ఈ కార్య్రకమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్రెడ్డి, చేవెళ్ల ఆర్డీవో చంద్రకళ, ఎంపీడీవోలు హిమబిందు, వెంకయ్యగౌడ్, చేవెళ్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పెంటయ్యగౌడ్, ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులు, ముడిమ్యాల్ పీఏసీఎస్ చైర్మన్ గోనె ప్రతాప్రెడ్డి, గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పాండు గౌడ్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు వీరేందర్రెడ్డి, స్థానిక నేతలు, ప్రజలు పాల్గొన్నారు.