చేవెళ్లటౌన్, మార్చి 10: అన్నదానం చేయడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మహాశిరాత్రి జాతరను పురస్కరించుకుని లక్ష్మీవేంకటేశ్వర స్వామి దేవాలయ ఆవరణలో మాజీ ఎంపీపీ బాల్రాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రభాకర్, కవడి తిరుపతి రెడ్డి, మంగలి యాదగిరి, నర్సింహులు, వెంకటేశ్, మహేశ్, మంగలి ప్రభు, శేఖర్రెడ్డి, బాలు, విష్ణు, శ్రీనివాస్ పాల్గొన్నారు.
అదే విధంగా శివరాత్రి జాతరకు వచ్చే భక్తుల కోసం చేవెళ్ల గ్రామానికి చెందిన జైపాల్ రెడ్డి కూడా వేంకటేశ్వర స్వామి దేవాలయ ఆవరణలో అన్నదానం చేశారు.
అన్నిదానాల కన్నా అన్నదానం మిన్న అన్నిదానాల కన్నా అన్నదానం మిన్న అని చేవెళ్ల సీఐ లక్ష్మీరెడ్డి అన్నారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని చేవెళ్ల మండల కేంద్రంలోని పుష్కరిణి ఆవరణలో మహాశివరాత్రి జాతరకు వచ్చిన భక్తుల కోసం చేవెళ్లకు చెందిన జగన్నాథ్రెడ్డి ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని పీఏసీఎస్ చైర్మన్ వెంకట్రెడ్డి, నాయకులతో కలిసి ప్రారంభించారు.