షాబాద్, జూన్ 18 : తెలంగాణ రాష్ట్రంలో ఆడబిడ్డల తాగునీటి కష్టాలు తీర్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని చేవెళ్ల ఎమ్మె ల్యే కాలె యాదయ్య అన్నారు. ఆదివారం షాబాద్ మండలంలోని అంతారం మిషన్ భగీరథ ప్రాజెక్టు వద్ద నిర్వహించిన చేవెళ్ల నియోజకవర్గస్థాయి మంచినీళ్ల పండుగ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం మహిళలు బతుకమ్మలతో ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికారు. జాతీయ జెండా ఎగురవేసి వందనం చేశారు. భగీరథ ప్రాజెక్టు ను సందర్శించిన ఎమ్మెల్యేకు నీటి ఫిల్డర్, సరఫరా తదితర విషయాలను సంబంధిత అధికారులు వివరించారు. తాగునీటిని పొదుపుగా వాడుకుంటామని ప్రతిజ్ఞ చేశారు.
ఈ సందర్భం గా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే యాదయ్య మాట్లాడారు. సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు. కార్యక్రమంలో చేవెళ్ల ఆర్డీవో వేణుమాధవ్రావు, ఎంపీపీలు ప్రశాంతిరెడ్డి, గోవర్ధన్రెడ్డి, నక్షత్రం, జడ్పీటీసీ గోవిందమ్మ, శంకర్పల్లి మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి, సర్పంచ్ బండి యాదమ్మ, రై తుబంధు సమితి జిల్లా సభ్యుడు ప్రభాకర్రెడ్డి, ఎంపీడీవోలు అనురాధ, వెంకయ్య, సంధ్య, తహసీల్దార్ సైదులుగౌడ్, సీఐ గురువయ్యగౌడ్, మిషన్ భగీరథ డీఈఈ ఇర్ఫాన్, ఏఈలు శారద, గీత, శివ, ఎంపీవో హన్మంత్రెడ్డి, ఏపీవో వీరాసింగ్, మా ర్కెట్ కమిటీ చైర్మన్ పాపారావు, బీఆర్ఎస్ చేవెళ్ల మండలాధ్యక్షుడు ప్రభాకర్, గోపా ల్, ఆయా గ్రామాల సర్పంచులు సుబ్రహ్మణ్యేశ్వరి, కేతన, అనిత, స్వర్ణలత, మాణిక్యారెడ్డి, ఎంపీటీసీ శోభారాణి, పార్టీ నాయకులు గోవర్ధన్రెడ్డి, వెంకట్రెడ్డి, నాగార్జునరెడ్డి, రాజు, జంగయ్య, యాదిరెడ్డి, శేఖర్రెడ్డి పాల్గొన్నారు.
చేవెళ్లలో..
చేవెళ్లటౌన్ : తాగు నీటి పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అవరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా చేవెళ్లలోని గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు మంచి నీటి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించి, గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఉత్సవాలను పురస్కరించుకుని ప్రజా ప్రతినిధులు, మిషన్ భగీరథ సిబ్బంది, ఆయా శాఖల అధికారులను ఎమ్మెల్యే కాలె యాదయ్య సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణ ప్రభుత్వం మిషన్ భగీరథ పథకం ద్వారా చేపట్టిన తాగునీరు ప్రతి పల్లెకు పైపు లైన్ ద్వారా తాగునీటిని అందిస్తూ ప్రజల దాహార్తిని తీర్చిందన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో వేణుమాదవ రావు, ఎంపీపీ విజయలక్ష్మి, రమణారెడ్డి, జడ్పీటీసీ మాలతి, సర్పంచ్లు శైలజాఆగిరెడ్డి, మోహన్ రెడ్డి, మల్లారెడ్డి, శ్రీనివాస్, ప్రభాకర్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ప్రభాకర్, వైస్ ఎంపీపీ శివప్రసాద్, ఎంపీటీసీలు రాములు, రవీందర్ రెడ్డి, ఎంపీడీవో రాజ్ కుమార్, తహసీల్దార్ శ్రీనివాస్, డీటీ రాజశేఖర్, మండల యూత్ అధ్యక్షుడు తోట శేఖర్, ఏఈలు గీతాశ్రావంతి, అనూష, వ్యసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు కృష్ణ, వెంకటేశ్, ఫాయాజ్, వార్డు సభ్యులు, నాయకులు కృష్ణారెడ్డి, రమణారెడ్డి, నరేందర్ గౌడ్ తదితరులు ఉన్నారు.
షాద్నగర్లో..
షాద్నగర్ : నాడు మంచి నీళ్ల కోసం గోస పడ్డ తెలంగాణ ప్రజలు నేడు ఇంటి ముందు సురక్షిత మంచి నీళ్లను తాగుతున్నారని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. ఆది వారం ఫరూఖ్నగర్ మండలం కమ్మదనంలోని వాటర్ గ్రీడ్ ఆవరణలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహిం చిన మంచి నీళ్ల పండుగలో ఆయన పాల్గొని మాట్లాడారు. సీఎం కేసీఆర్ కృషి ఫలితంగా మిషన్ భగీరథ పథకం ద్వారా అన్ని వర్గాల ప్రజలకు మంచి నీళ్లను అందిస్తున్నామన్నారు. నేడు నీళ్ల ట్యాంక్ లేని పల్లె, నల్లా లేని ఇళ్లు లేదని చెప్పారు. షాద్నగర్ నియోజకవర్గంలో రూ. 433.70 కోట్ల నిధులను వెచ్చించి పైపు లైన్ నిర్మాణం, ఉపరిత ట్యాంకులు, నల్లాలను ఏర్పాటుచేశామన్నారు. మిషన్ భగీరథలో విధులు నిర్వహిస్తు న్న పలువురు ఉద్యోగులను ఎమ్మెల్యే ఘనంగా సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. ఉద్యోగుల పనితీరును ప్రశంశించా రు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ ఈటెల గణేశ్, ఎంపీపీ ఖాజ ఇద్రీస్, జడ్పీటీసీలు వెంకట్రాంరెడ్డి, విశాల, మున్సిపల్ చైర్మన్ నరేందర్, అయా మండలాల ప్రజాప్రతినిధులు, అధి కారులు, గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.
నందిగామలో..
నందిగామ : దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నందిగామ మండల కేంద్రంతో పాటు గ్రామాల్లో నీటి దినోత్సవ వేడుకలను ఘనం గా నిర్వహించారు. నందిగామలో జరిగిన కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్ పాల్గొని మాట్లాడారు. ఇంటింటికీ నల్లాల ద్వారా తాగునీరు అందించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ కుమార్గౌ డ్, ఎంపీవో శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి మల్లికార్జున్రెడ్డి, వార్డు సభ్యులు, విద్యా కమిటీ చైర్మన్ రాములు, కోఆప్షన్ సభ్యుడు పెంటయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఇన్ముల్నర్వలో..
కొత్తూరు : దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మండల పరిధిలోని ఇన్ముల్నర్వలో ఆదివారం మిషన్ భగీరథ ట్యాంకు వద్ద మంచి నీళ్ల పండుగను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఎంపీ పీ శోభాలింగంనాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు తర్వాత నీటిగొస తీరిందని ఈ ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుంద న్నా రు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ శ్రీరాములు యాదవ్, అధికా రులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.
తలకొండపల్లిలో..
తలకొండపల్లి : దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మండల కేంద్రం తో పాటు వివిధ గ్రామాల్లో ఆదివారం మంచినీళ్ల పండుగను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల స ర్పంచ్లు, మిషన్ భగీరథ అధికారులు, నాయకులు గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మొయినాబాద్లో..
మొయినాబాద్ : దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మండల కేంద్రంతో పాటు గ్రామాల్లో మంచినీళ్ల పండుగను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో కేతిరెడ్డిపల్లి సర్పంచ్ శోభావెంకట్రెడ్డి, పంచాయతీ కార్యదర్శి తార, చిలుకూరు సర్పంచ్ స్వరూప, హిమాయత్నగర్ సర్పంచ్ మంజూల, శ్రీరాంనగర్ సర్పంచ ప్రభాకర్రెడ్డి, అమ్డాపూర్ సర్పంచ్ రవళి, పెద్దమంగళారం సర్పంచ్ నరోత్తంరెడ్డి, బాకారం సర్పంచ్ రాఘివరెడ్డి, అజీజ్నగర్ సర్పంచ్ సంధ్య తదితరులు పాల్గొన్నారు.