షాబాద్/చేవెళ్ల రూరల్, ఏప్రిల్ 21 : తెలంగాణలో ప్రతిపక్షాలకు భవిష్యత్తు లేదని, బీఆర్ఎస్ పార్టీతోనే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యమవుతుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శుక్రవారం చేవెళ్ల మండల పరిధిలోని ఖానాపూర్ గేట్ వద్ద శ్రీనివాస కల్యాణ మండపంలో ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఆలూర్, దేవరాంపల్లి, రేగడి ఘణపూర్, ఖానాపూర్, నాంచేరి, అంతారం, కౌకుంట్ల, హస్తేపూర్, మిర్జాగూడ, బస్తేపూర్ గ్రామాల పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని ఎమ్మెల్యే కాలె యాదయ్య, మాజీ ఎమ్మెల్యే కె.ఎస్ రత్నం తదితరులకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ 14 ఏండ్లు సుదీర్ఘపోరాటం చేసి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్ అని చెప్పారు. కొత్త రాష్ర్టాన్ని భావితరాలకు ఉపయోగపడేలా అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. ‘రైతు బంధు’తో ఎకరాకు రూ.10వేల పెట్టుబడి సాయం, ‘రైతు బీమా’తో రూ.5లక్షల ఆర్థిక సాయం అందించడం దేశంలో ఎక్కడా లేదన్నారు. ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్ వంటి సంక్షేమ పథకాలు పేదలకు అండగా నిలుస్తున్నాయన్నారు.
మంత్రి కేటీఆర్, మంత్రి సబితారెడ్డి, మాజీ మంత్రి మహేందర్రెడ్డిల సహకారంతో రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల నియోజకవర్గం షాబాద్, శంకర్పల్లి మండలాల్లో పెద్ద పెద్ద కంపెనీలు ఏర్పాటవుతున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని కాఫీ కొట్టి పీఎం కిసాన్గా పేరు మార్చి రూ.2వేలు ఇస్తుందన్నారు. తెలంగాణకు వచ్చే నిధులకు అడ్డుపడుతూ, కృష్ణా, గోదావరి నీళ్లు ఇవ్వకుండా, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అనుమతులు ఇవ్వడం లేదన్నారు. రంగారెడ్డి జిల్లాతో పాటు చేవెళ్లలో ఏం అభివృద్ధి చేశారని ఇక్కడ బహిరంగసభ నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి ఈ ప్రాంతానికి సాగునీరు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ నెల 25న నిర్వహించే నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ పార్టీ సమావేశానికి కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తూ, రాష్ర్టాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతున్న ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ పట్లోళ్ల కృష్ణారెడ్డి, ఎంపీపీ మల్గారి విజయలక్ష్మి, జడ్పీటీసీ మర్పల్లి మాలతీ, వైస్ ఎంపీపీ కర్నె శివప్రసాద్, మార్కెట్ కమిటీ చైర్మన్ మిట్ట వెంకటరంగారెడ్డి, వైస్ చైర్మన్ నర్సింలు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పెద్దోళ్ల ప్రభాకర్, పార్టీ నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు వనం లక్ష్మీకాంత్రెడ్డి, మండల యూత్ అధ్యక్షుడు తోట శేఖర్, సర్పంచుల సంఘం మండలాధ్యక్షుడు శేరి శివారెడ్డి, బీఆర్ఎస్వీ మండల అధ్యక్షుడు నరేందర్గౌడ్, ఆయా గ్రామాల సర్పంచులు సులోచన అంజన్గౌడ్, విజయలక్ష్మినర్సింలు, భీమయ్య, గాయత్రిగోపాలకృష్ణ, నరహరి, శ్రీలతప్రభాకర్, సక్కుబాయిఅమరేందర్గౌడ్, వెంకటయ్య, ఎంపీటీసీలు నరేందర్చారి, రవీందర్రెడ్డి, వాసవి, మమత, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రమణారెడ్డి, కృష్ణారెడ్డి, నాగార్జునరెడ్డి, రామేశ్వర్రెడ్డి, గిరిధర్రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు వెంకటేశ్, మహేశ్, నాయకులు చింటు, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.