ఆమనగల్లు, జూలై 22 : కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృత నిశ్చయంతో ఉన్నట్లు ఎమ్మెల్యే జైపాల్యాదవ్ తెలిపారు. శనివారం హైదరాబాద్లోని ప్రగతి భవన్లో ఎమ్మెల్యే ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసి ఆమనగల్లు, కల్వకుర్తి మున్సిపాలిటీలకు, నియోజకవర్గ అభివృద్ధికి ఎస్డీఎఫ్ నిధులు మంజూరు చేయాలని కోరినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. మంగళపల్లి, తదితర గ్రామాల సమీపంలో ఉన్న వాగులపై వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని వినతిపత్రమిచ్చారు.
గత అసెంబ్లీ ఎన్నికల ప్రజా ఆశీర్వాద సభలో ఇచ్చిన హామీల మేరకు ఇటీవల మంజూరైన ప్రభుత్వ పాలిటెక్నిక్, డిగ్రీ కళాశాలలకు.. ఆమనగల్లు ప్రభుత్వ దవాఖానను 30 నుంచి 50 పడకలుగా మార్చనున్న నేపథ్యంలో నిధులు మంజూరు చేయాలని, గట్టుప్పలపల్లిలో బ్యాంక్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రిని కోరినట్లు ఎమ్మెల్యే తెలిపారు. సీఎం స్పందిస్తూ నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే చెప్పారు.