కులకచర్ల, ఫిబ్రవరి 18 : కులకచర్ల పీఏసీఎస్ చైర్మన్గా తిర్మలాపూర్కు చెందిన కనకం మొగులయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కులకచర్ల పీఏసీఎస్ చైర్మన్గా ఉన్న బుయ్యని మనోహర్రెడ్డి తాండూరు ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ఆయన చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. దీంతో చైర్మన్ పదవి ఖాళీగా ఉండడంతో వైస్చైర్మన్ నాగరాజ్కు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. పీఏసీఎస్ చైర్మన్ను ఎన్నుకునేందుకు డీసీవో శుక్రవారం నోటిపికేషన్ జారీ చేసి, ఆదివారం డైరెక్టర్లు అందరూ పీఏసీఎస్ ఎంసీ కార్యవర్గ సమావేశానికి హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు.
అధికారుల సూచన మేరకు 13 మంది డైరెక్టర్లు సమావేశానికి హాజరయ్యారు. ముందుగా చైర్మన్ పదవి కోసం నామినేషన్ వేయాలని డీసీవో ఈశ్వరయ్య డైరెక్టర్లను కోరారు. తిర్మలాపూర్కు చెందిన డైరెక్టర్ కనకం మొగులయ్య నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఉదయం 10 గంటల నుంచి గంట వరకు ఒకే నామినేషన్ దాఖలైంది. మిగతా డైరెక్టర్లు ఎవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో మొగులయ్యను ఏకగ్రీవంగా పీఏసీఎస్ చైర్మన్గా ఎన్నుకున్నారని డీసీవో ప్రకటించారు. దీంతో చైర్మన్ ఎన్నిక ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది.
కాగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి పీఏసీఎస్ చైర్మన్గా ఎన్పికైన మొగులయ్యను ఘనంగా సన్మానించారు. పీఏసీఎస్ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని, రైతులకు న్యాయం చేసేందుకు సోసైటీ సేవలు అందించాలని సూచించారు. అనంతరం పలువురు సభ్యులు ఎమ్మెల్యేను సన్మానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బ్లాక్ 2 అధ్యక్షుడు భరత్కుమార్, మండల అధ్యక్షుడు ఆంజనేయులు, డీసీసీ ఉపాధ్యక్షుడు భీంరెడ్డి, ఎంపీటీసీ రాంలాల్, నాయకులు గోపాల్నాయక్, కృష్ణయ్య, స్వామి, బచ్చిరెడ్డి, శ్రీనివాస్, భాస్కర్, నర్సింహులు, వెంకటయ్య, పీఏసీఎస్ వైస్ చైర్మన్ నాగరాజు, పీఏసీఎస్ సీఈవో బక్కారెడ్డి, పీఏసీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.