తాండూరు రూరల్, జనవరి 12: స్వామి వివేకానంద మహనీయుడని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి అన్నారు. శుక్రవారం తాండూరు మండలంలోని చెంగోల్, పట్టణంలోని మున్సిపల్ కార్యాలయ సమీపంలో ఏర్పాటు చేసిన వివేకానంద జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. యువత చెడుమార్గాన్ని వదిలి.. మంచి మార్గంలో నడవాలన్నారు. లక్ష్యాన్ని నిర్దేశించుకుని దాని సాధనకు నిరంతరం కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉత్తమ్చంద్ముదిరాజ్, డాక్టర్ సం పత్, బాల్రెడ్డి, జన్నె నాగప్ప, శ్రీనివాస్, హెచ్ఎం నర్సింహారెడ్డి, ఎంపీటీసీలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిన మహానుభావుడు స్వామి వివేకానంద అని రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్ పటేల్ అన్నారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని శాంత్మహల్ చౌరస్తాలో ఉన్న వివేకానంద విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ యువత వివేకానందను స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్లాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దీప, ఉపాధ్యాయు లు శ్రీధర్రెడ్డి, వెంకట్రెడ్డి, రాజన్గౌడ్, వివేక్సేవా సమితి అధ్యక్షులు వీరభద్రప్ప, శ్రీశైలం, భాను, హ రీశ్, నరేశ్, అఖిల్, బాలు, నర్సింహులు, శేఖర్ పాల్గొన్నారు.
నవాబుపేట, జనవరి 12 : మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం స్వామి వివేకానంద జయంతిని యువజన సంఘా ల నాయకులు ఘనంగా నిర్వహించారు. ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తామని వారు పేర్కొన్నారు. కార్యక్రమాల్లో శ్రీహరిగౌడ్, పవన్కుమార్, మల్లేశం, వినోద్కుమార్, ప్రశాంత్, శ్రీకాంత్, ప్రభాకర్, శ్రీహరి, సాయికు మార్, గోవర్ధన్, విష్ణు, శ్రీధర్, పలు గ్రామాలకు చెందిన యువకులు పాల్గొన్నారు.
దోమ, జనవరి 12 : యువతకు స్ఫూర్తిగా నిలిచిన స్వామి వివేకానంద జయంతిని జాతీయ యువజన దినోత్సవంగా నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తున్నదని ఉప సర్పంచ్ బుగ్గ య్య, బీసీ సంక్షేమ సంఘం మండలాధ్యక్షుడు గోవర్ధన్ అన్నా రు. మండలంలోని అయినాపూర్ గ్రామంలో స్వామి వివేకానంద జయంతిని వారు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో బాబయ్య, వెంకట్రాములు, ఆనంద్, వెంకటేశ్ , పాండు, సలీం, తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.
పరిగి, జనవరి 12: స్వామి వివేకానంద యువతకు దిక్సూచి అని పలువురు పేర్కొన్నారు. వివేకానందుడి జయంతిని పురస్కరించుకుని శుక్రవారం పరిగిలోని ఆయన విగ్రహానికి మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. వివేకానందుడికి నివాళులర్పించిన వారిలో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు మారుతికిరణ్, ఎంఈవో హరిశ్చంద్ర, జేఏసీ జిల్లా చైర్మన్ ముకుంద నాగేశ్వర్, స్వామి వివేకానంద యువజన సంఘం అధ్యక్షుడు బాబయ్య, గౌరవాధ్యక్షుడు శ్రీశైలం, అనిల్కుమార్, రమేశ్, చంద్రమోహన్, శ్రీశైలం, ఉపాధ్యాయ సంఘాల నాయకులు అమర్నాథ్, శ్రీశైలం, శ్రీనివాస్, వెంకటయ్య తదితరులున్నారు.
కులకచర్ల, జనవరి 12 : వివేకానంద అడుగుజాడల్లో యువత పయనించి ఆయన ఆశయ సాధనకు కృషిచేయాలని పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. శుక్రవారం కులకచర్ల, చౌడాపూర్ మండలాలతోపాటు ఇప్పాయిపల్లి, ఘనాపూర్, బండవెల్కిచర్ల గ్రామాల్లో వివేకానంద జయంతిని ఘనంగా నిర్వహించారు. కులకచర్ల మండల కేంద్రంలోని వివేకానంద విగ్రహం దగ్గర స్వామి వివేకానంద యువజన సం ఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో సర్పంచ్ సౌమ్యావెంకట్రాంరెడ్డి, జిల్లా రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీధర్రెడ్డి, కులకచర్ల మాజీ ఎంపీటీసీ కృష్ణయ్యగౌడ్, కాంగ్రెస్ పార్టీ కులకచర్ల మండల అధ్యక్షుడు ఆంజనేయులు, మహిపాల్, వెంకటయ్యగౌడ్, స్వామి, శ్రీశైలం, వెంకట్రాము లు, హరికృష్ణ, వివేకానంద యువజన సంఘం సభ్యులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
మోమిన్పేట, జనవరి 12: నా దేశం-నా భవిష్యత్తు అని పిలుపునిచ్చిన వివేకానంద స్ఫూర్తితో యువత ముందుకు సా గాలని ఎస్ఐ విఠల్రెడ్డి అన్నారు. శుక్రవారం వివేకానంద జయంతిని పురస్కరించుకొని మండలంలోని టేకులపల్లి బస్టాండ్ చౌరస్తాలో వివేకానందుడి విగ్రహానికి మోమిన్పేట సొసైటీ చైర్మన్ విష్ణువర్ధన్రెడ్డి, ఎంపీటీసీ శ్రీనివాస్రెడ్డి, యువజన సంఘం సభ్యులతో కలిసి ఎస్ఐ పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ రాయిస్, యువజన సంఘాల సభ్యులు నగేశ్, శ్రీనివాస్, సత్యనారా య ణ, మల్లేశం, వెంకట్రెడ్డి, రవీందర్, అడివయ్య, బాల్రాజ్, రమేశ్, పాండు, శ్రీశైలం,సురేందర్రెడ్డి, ప్రవీణ్కుమార్, శ్రీకాంత్రెడ్డి, శివారెడ్డి, యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు.
ధారూరు, జనవరి 12: మండలంలోని నాగారం, హరిదాస్పల్లి, నాగసముందర్, అంతారం గ్రామా ల్లో వివేకానంద జయంతిని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో నాగా రం గ్రామ పెద్దలు వీరేందర్రెడ్డి, హన్మంత్రెడ్డి, గోవర్ధన్రెడ్డి, కృష్ణారెడ్డి, నర్సింహులు, చందర్, సూర్యకాంత్, యాదయ్య, శ్రీను, రవి, బసప్ప, మల్లారెడ్డి, వెంకట్ పాల్గొన్నారు.
పెద్దేముల్, జనవరి 12 : యువత వివేకానందుడి అడుగుజాడ ల్లో ముందు కు సాగాలని పెద్దేముల్ వివేకానంద యువజన సంఘం అధ్యక్షుడు గోపాలకృష్ణ, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్గౌడ్ అన్నారు. మండలకేంద్రంలో వివేకానంద జయంతిని నిర్వహించా రు. కార్యక్రమంలో మాజీ అధ్యక్షుడు నర్సింహు లు, ఫయాజ్, పాండు, రంగ య్య, ప్రసాద్ పాల్గొన్నారు.
వికారాబాద్, జనవరి 12: వివేకానంద జయంతిని వికారా బాద్ స్వామి వివేకానంద గురుకుల్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్, యజ్ఞ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు శుక్రవారం ఘనంగా జరుపుకొన్నారు. నగర సంకీర్తన ర్యాలీ ఎన్నెపల్లి నుంచి గ్రంథాలయం మీదుగా అలంపల్లి రోడ్డు వరకు సాగింది. ఇందులో యజ్ఞ ఫౌండేషన్ చైర్మన్, మాశారదా దవా ఖాన డైరెక్టర్ డాక్టర్ రాజశేఖర్, యజ్ఞ అధ్యక్షుడు డాక్టర్ యు జ్వల్రాజ్, సదానందరెడ్డి, గురుకుల విద్యార్థులు పాల్గొన్నారు.