కొత్తూరు, ఏప్రిల్ 15: తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేద ప్రజలకు కొండంత అండగా నిలుస్తున్నాయని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కొత్తూరు ఎంపీడీవో కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 22 మందికి షాదీముబారక్, కల్యాణలక్ష్మి చెక్కులు, ముస్లింలకు 150 రంజాన్ తోఫాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను దేశంలోని అనేక రాష్ర్టాల ప్రజలు కూడా తమ దగ్గర అమలు చేయాలని కోరుకుంటున్నారని అన్నారు. మహారాష్ట్రలో ఇప్పటికే చాలా మంది నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ పిన్నింటి మధుసూదన్రెడ్డి, జడ్పీటీసీ శ్రీలత, మున్సిపల్ చైర్పర్సన్ బాతుక లావణ్య, వైస్ ఎంపీపీ శోభ, ఎంపీడీవో శరత్చంద్రబాబు, తహసీల్దార్ రాములు, కౌన్సిలర్ కొస్గి శ్రీనివాసులు, బీఆర్ఎస్ నాయకుడు వంకాయల నారాయణరెడ్డి, టసత్యనారాయణ, గపాల్గొన్నారు.
నందిగామ : అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. నందిగామ మండల కేంద్రంలో శనివారం 23 మందికి కల్యాణలక్ష్మి, నలుగురికి షాదీముబారక్ చెక్కులను అందజేశారు. అనంతరం ముస్లింలకు రాష్ట్ర ప్రభు త్వం అందజేస్తున్న రంజాన్ తోఫాను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అన్ని కులాలు, మతాలకు రాష్ట్ర ప్రభుత్వం సమన్యాయం చేస్తున్నదని, ప్రజలు పండుగలను సంతోషంగా జరుపుకోవాలని సూ చించారు. అనంతరం మండలంలోని ఈదులపల్లి గ్రామానికి చెందిన వైష్ణవికి రూ.2. 50 లక్షల ఎల్వోసీని, నందిగామ గ్రామానికి చెందిన ఖాజాపాషాకు రూ. 60 వేల చెక్కును అందజేశారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, ఎంపీపీ ప్రియాంకగౌడ్, మాజీ ఎంపీపీ శివశంకర్గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నారాయణరెడ్డి, పీఏసీఎస్ మాజీ చైర్మన్ విఠల్, సర్పంచ్లు అశోక్, జట్ట కుమార్, నర్సింహులు, రమేశ్గౌడ్, స్వామి, ఉప సర్పంచ్ కుమార్గౌడ్, ఎంపీటీసీలు చంద్రపాల్రెడ్డి, కుమారస్వామిగౌడ్, కో ఆప్షన్ మెంబర్ బేగ్, పెంటయ్య పాల్గొన్నారు.