షాద్నగర్, ఆగస్టు7 : రైతుల సంక్షేమమే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుందని షాద్ నగర్ ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. ఆదివారం చౌదరిగూడ మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటుచేసిన డీసీఎంఎస్ రైతు సేవా కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ అనేక పథకాలను ప్రవేశపెట్టారని గుర్తుచేశారు.
రైతుబీమా, రైతుబంధు వంటి పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని తెలిపారు. గతంలో వాన కాలం వచ్చిందంటే ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉండేవి కావన్నారు. నేడు ఆ పరిస్థితి లేదని చెప్పారు. రైతులకు వావల్సిన అన్ని రకాల విత్తనాలను ప్రభుత్వం అందుబాటులో ఉంచిందన్నారు.
రైతులు సంప్రదాయ వ్యవసాయ పద్ధతులకు స్వస్తిపలికి, మార్కెట్ డిమాండ్కు అనుగునంగా పంటను సాగుచేయాలని రైతులను కోరారు. డీసీఎంఎస్ రైతు సేవా కేంద్రం సేవలను క్షేత్రస్థాయిలో విసృతపరిచి రైతులకు నాణ్యమైన సేవలను అందించాలని సూంచించారు. కార్యక్రమంలో మండల టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.