హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ) : నల్లమల అటవీ ప్రాంతం నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్లో 2025 జూలైలో వరుసగా పెద్దపులులు చనిపోయాయి. తాజాగా ఆధారాలు గుర్తించిన అటవీ అధికారులు నిందితులను అరెస్టు చేశారు. గత సంవత్సరం అంతర్జాతీయ పులుల దినోత్సవం జూలై 29న వేటగాళ్ల వలలో పడి ఓ పులి చనిపోయింది. దాని పంజాను, గోళ్లను వేటగాళ్లు తీసుకెళ్లారు. జూలై 31న మరో పులి చనిపోయింది.
రెండు పులులు చనిపోయినప్పటికీ అధికారులు విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లకపోవడం.. తాజాగా నిందితులను అరెస్టు చేయడం అనుమానాలకు తావిస్తున్నది. పులుల సంరక్షణకు చర్యలు తీసుకోకపోవడంతోనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని స్థానికులు విమర్శిస్తున్నారు.