కేశంపేట, ఫిబ్రవరి 11 : బీఆర్ఎస్ పాలనలోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. శనివారం మండలంలోని అల్వాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి కాంగ్రెస్, బీజేపీ నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని, రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజలు బీజేపీకి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రజలు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరిన వారిలో పగిడిపాల వెంకటయ్య, అవ్వారు శేఖర్, పడకంటి శంకరయ్య, అలూరు యాదయ్య, పడకంటి వెంకటయ్య, దన్నడి దశరథ ఉన్నారు. కార్యక్రమంలో తిరుమలరెడ్డి శ్రీనివాస్, రాజు, కృష్ణయాదవ్, శంకరయ్య, రాజేందర్, అలూరు రాజు, శ్రీశైలం, మల్లేశ్, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.
మండలంలోని పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. లేమామిడికి చెందిన జె.పాండుకు రూ. 60 వేలు, కాకునూరు-హనుమంత్రెడ్దికి రూ.60 వేలు, చెన్నరాములుకు రూ.56,500, కొత్తపేటకు చెందిన జి.నర్సమ్మకు రూ.60 వేలు, ఈశ్వర్కు రూ. 24 వేలు, సయ్యద్ పాషకు రూ.18 వేలు, అల్వాల్కు చెందిన పి.లక్ష్మమ్మకు రూ.25 వేలు, పి.సూరమ్మకు రూ.17 వేల చెక్కులను పంపిణీ చేశారు. పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ జగదీశ్వర్గౌడ్, నాయకుడు మురళీధర్రెడ్డి పాల్గొన్నారు.