షాద్నగర్ టౌన్, మే 29 : షాద్నగర్ పట్టణానికి మహర్దశ వచ్చింది. ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుండటంతో పట్టణ రూపురేఖలు మారిపోతున్నాయి. గతంలో ఇరుకైన, శిథిలావస్థకు చేరిన గదుల్లో కొనసాగిన షాద్నగర్ గ్రేడ్-1 గ్రంథాలయం ప్రభుత్వం తీసుకున్న చర్యలతో విశాలమైన గదులు.. అన్ని రకాల వసతులతో సిద్ధమైన లైబ్రరీని.. వృద్ధు లు, నిరాశ్రయుల సౌకర్యార్థం నిర్మించిన నైట్షెల్టర్ భవనాన్ని కూడా మంగళవారం మంత్రు లు ప్రశాంత్రెడ్డి, సబితారెడ్డి, శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ప్రారంభించనున్నారు. అదేవిధంగా మున్సిపాలిటీ పరిధిలోని చటాన్పల్లి రైల్వేగేటు వద్ద రూ. 95 కోట్లతో నిర్మించనున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులకూ వారు శంకుస్థాపన చేయనున్నారు.
గత ఉమ్మడి ప్రభుత్వాల పాలనలో షాద్నగర్ గ్రేడ్-1 గ్రంథాలయం శిథిలావస్థకు చేరడంతోపాటు సరైన వసతుల్లేకపోవడంతో పాఠకులు, ఉద్యోగార్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కాగా.. తెలంగాణ ఏర్పడి కేసీఆర్ సీఎం అయిన తర్వాత గ్రంథాలయాల నిర్మాణానికి పెద్దపీట వేశారు. నూతన గ్రంథాలయ భవన నిర్మాణ పనులకు 2021 ఆగస్టు 19న మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ శంకుస్థాపన చేశారు. రూ.1.88 కోట్లతో ఆధునిక హంగుల తో షాద్నగర్ గ్రేడ్-1 గ్రంథాలయం…రూ. 46 లక్షలతో నైట్ షెల్డర్ భవనాల నిర్మాణం పూర్తై ప్రారంభనికి సిద్ధమయ్యాయి. ఈ లైబ్రరీలో విశాలమైన గదులతోపాటు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికోసం అన్ని వసతులను కల్పించా రు. మంగళవారం గ్రంథాలయం ప్రారంభం కానుండటంపై విద్యార్థులు, ఉద్యోగార్థులు, ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సేద తీరేందుకు నైట్షెల్టర్
షాద్నగర్ నియోజకవర్గంలో ఆరు మండలాలుండగా.. షాద్నగర్ పట్టణానికి ప్రతిరోజూ వేలాది మంది ప్రజలు వివిధ పనుల నిమిత్తం వచ్చి వెళ్తుంటారు. తిరిగి వెళ్లే సమయంలో చీకటి పడితే వారు సేదతీరేందుకు సరైన వసతులు లేవని గుర్తించిన అధికారులు రూ. 46 లక్షలతో నైట్షెల్టర్ భవనాన్ని శరవేగంతో పూర్తి చేశారు. అందులో అన్ని వసతులు కల్పించారు. వృద్ధులు, నిరాశ్రయులకు ఈ నైట్షెల్టర్ ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని అధికారులు, ప్రజ లు పేర్కొంటున్నారు.
నేడు షాద్నగర్లో మంత్రుల పర్యటన
షాద్నగర్ : అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం లో భాగంగా మంగళవారం షాద్నగర్ నియోజకవర్గంలో మంత్రులు ప్రశాంత్రెడ్డి, సబితాఇంద్రారెడ్డి, శ్రీనివాస్గౌడ్ పర్యటిస్తారని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ తెలిపారు. సుమారు రూ.161.73 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులను వారు ప్రారంభిస్తారన్నారు. నందిగామ బైపాస్ రోడ్డులో విద్యుత్ ఉప కేంద్రం, షాద్నగర్ నుంచి కేశంపేట వరకు బీటీ రోడ్డు పనులు, షాద్నగర్ చౌరస్తా నుంచి సోలీపూర్ బైపాస్ రోడ్డు వరకు రోడ్డు విస్తరణ, రూ.1.88 కోట్లతో నిర్మించిన గ్రంథాల య భవనం, రూ. 95 కోట్లతో నూతనంగా నిర్మించే చటాన్పల్లి ఆర్వోబీ పనుల ప్రారంభం, రూ.45 లక్షలతో నిర్మించిన నైట్ షెల్టర్, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని వారు ప్రారంభిస్తారని చెప్పారు.
నేడు రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులకు శంకుస్థాపన
మున్సిపాలిటీ పరిధిలోని చటాన్పల్లి రైల్వేగేట్వద్ద కొన్నేండ్లుగా వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అత్యవసర సమయంలో ఈ గేట్ నుంచి వెళ్తున్నప్పుడు రైల్వే గేట్ పడితే 30-45 నిమిషాల పాటు నిరీక్షించాల్సి వస్తున్నదని వాపోతున్నా రు. ఆ సమయంలో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నాయని పేర్కొంటున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని గత ఉమ్మడి ప్రభుత్వాల పాలకులకు పలుసార్లు విజ్ఞప్తి చేసి నా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. ఈ గేట్ నుంచి చటాన్పల్లి, బైపాస్ రోడ్డు, బుచ్చిగూడ, దూసకల్, వెల్జర్ల, సంగెం, కొత్తపేట తదితర గ్రామాల ప్రజలు ప్రతిరోజూ వేలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. కాగా.. తెలంగాణ సర్కారు ఏర్పడ్డాక ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ రైల్వేగేట్ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. ఇటీవలే రైల్వే ఓవర్ బ్రిడ్జి ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు రూ.95 కోట్లను మంజూరు చేసింది. ఆ నిధులతో అధికారులు బ్రిడ్జి పనులకు శ్రీకారం చుట్టారు. తెలంగాణ సర్కార్ రూ.61.31కోట్లు, రైల్వేశాఖ రూ.33.69 కోట్ల నిధులను ఖర్చు చేయనున్నది. ఆర్అండ్బీ శాఖ ఆధ్వర్యంలో నిర్మించనున్న ఈ వంతెన స్థలాన్ని ఇటీవలే ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, అధికారులు పరిశీలించారు. రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులను మంగళవారం మంత్రులు ప్రారంభించనున్నారు. ఈ వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
విశాలమైన గదులు
షాద్నగర్ పట్టణంలో నూతనంగా నిర్మా ణం పూర్తైన గేడ్-1 గ్రంథాల యం అందరికీ ఉపయోగకరంగా ఉన్న ది. విద్యార్థులు, నిరుద్యోగ యువతీయువకులకు అవసరమై న అన్ని పుస్తకాలను అందుబాటులో ఉంచు తాం. గదులను విశాలంగా నిర్మించడంతోపాటు మౌలిక వసతులను కల్పించడం జరిగింది.
-లక్ష్మీనర్సింహారెడ్డి, గ్రేడ్-1 గ్రంథాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్, షాద్నగర్
కొన్నేండ్లుగా ఇబ్బంది పడుతున్నాం
రైల్వే గేట్ పడినప్పుడల్లా ఇబ్బంది పడుతు న్నాం. కొన్నేండ్లుగా ఈ సమస్య ఉన్నది. గత ఉమ్మడి ప్రభుత్వాల పాలకులకు పలుసార్లు విజ్ఞప్తి చేసినా ఫలితంలే దు. అత్యవసర సమయంలో వెళ్తున్నప్పుడు రైల్వేగేట్ పడితే రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా రు. ప్రభుత్వం రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉన్నది.
-బాలు వాహనదారుడు, షాద్నగర్
నిధుల మంజూరు హర్షణీయం
రైల్వే బ్రిడ్జి నిర్మాణానికి ఎమ్మెల్యే ఎంతో కృషి చేస్తున్నారు.ప్రజలు, వా హనదారుల సమస్య పరిష్కారానికిప్రభుత్వం నిధులు మంజూరు చేసి పనుల ప్రారంభానికి చర్యలు చేపట్టడం చాలా సంతోషంగా ఉన్నది. ఈ వంతెన నిర్మాణం పూర్తైతే ఎన్నో గ్రామాల ప్రజలకు ఇబ్బందులు తప్పుతాయి. రాకపోకలు సాఫీగా సాగుతాయి.
-బాలాజీఉదయ్ భారత జాగృతి విద్యార్థి విభాగం తాలూకా కన్వీనర్, షాద్నగర్