సొంతింటి కల సాకారమైన వేళ.. లబ్ధిదారులు సంబురాలు చేసుకున్నారు. డబుల్ బెడ్రూం ఇండ్ల పట్టాలు అందుకున్న వారి ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. గురువారం నాలుగు చోట్ల డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ పండుగ వాతావరణంలో జరిగింది. మహేశ్వరం నియోజకవర్గంలోని మన్సాన్పల్లిలో విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, పెద్దఅంబర్పేట మున్సిపాలిటీ తట్టిఅన్నారంలో హోంమంత్రి మహమూద్అలీ, హట్టిగూడలో రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలు, భూగర్భ గనులశాఖమంత్రి పట్నం మహేందర్రెడ్డి,అబ్దుల్లాపూర్మెట్ మండలం కుత్బుల్లాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని తిమ్మాయిగూడెంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ గొప్ప విజన్ ఉన్న నేత సీఎం కేసీఆర్ అన్నారు. ఎవరికీ ఒక్క రూపాయి లంచం ఇవ్వకుండా మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ప్రభుత్వం పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేసి ఉచితంగా ఇండ్లను అందజేస్తున్నదన్నారు. తెలంగాణ సర్కార్ పేదలకు ఇండ్లను అందజేస్తుంటే.. జీర్ణించుకోలేకనే బీజేపీ నేతలు విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గృహ నిర్మాణం కోసం రూ.5 లక్షలు ఇస్తామంటున్న కాంగ్రెస్ మోసపూరిత హామీలను నమ్మి మోసపోవద్దని ప్రజలకు సూచించారు. హైదరాబాద్తోపాటు శివారు ప్రాంతాల్లో నివసిస్తున్న పేదలకు ధనవంతుల తరహాలో రాష్ట్ర ప్రభుత్వం ఇండ్లు నిర్మించి ఇస్తున్నదన్నారు. నిరుపేదల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ముందుకెళ్తున్నారన్నారు. గ్రేటర్ పరిధిలో అర్హులందరికీ ఇండ్లు అందేలా చర్యలు తీసుకుంటామని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు.
-రంగారెడ్డి, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ)
గొప్ప విజన్ ఉన్న నేత సీఎం కేసీఆర్
రంగారెడ్డి జిల్లాలో గురువారం రెండో విడుత డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ పండుగలా సాగింది. జిల్లాలోని నాలుగు ప్రాంతాల్లో తట్టిఅన్నారం, మన్సాన్పల్లి, హట్టిగూడ, తిమ్మాయిగూడెంలలో జరిగిన పంపిణీ కార్యక్రమాల్లో మంత్రులు సబితాఇంద్రారెడ్డి, పట్నం మహేందర్రెడ్డి మహమూద్ అలీతోపాటు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ విజయలక్ష్మి ముఖ్యఅతిథులుగా పాల్గొని లబ్ధిదారులకు ఇండ్ల పట్టాల ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేసి ఉచితంగా డబుల్ బెడ్ రూం ఇండ్లను అందజేస్తున్నట్లు వివరించారు.
రంగారెడ్డి, సెప్టెంబర్ 21(నమస్తే తెలంగాణ): విజన్ ఉన్న నేత సీఎం కేసీఆర్ అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. దూర దృష్టితో రాష్ర్టాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపారని..ఇంటింటికీ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను అందిస్తున్నారని కొనియాడారు. మహేశ్వరం నియోజకవర్గంలోని మన్సాన్పల్లిలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ కార్యక్రమానికి మంత్రి గురువారం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తుక్కుగూడ, సర్దార్నగర్, రావిరాల, మహేశ్వరం, మంఖాల్లకు చెందిన 800 మంది లబ్ధిదారులకు ఆమె డబుల్ బెడ్ రూం ఇండ్ల మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి సబితాఇంద్రారెడ్డి మాట్లాడుతూ పేదలు ఆత్మగౌరవంతో జీవించేలా సీఎం కేసీఆర్ డబుల్ బెడ్ రూం ఇండ్ల పథకాన్ని అమలు చేస్తున్నారని కొనియాడారు. తెలంగాణ ప్రభుత్వం జీహెచ్ఎంసీ పరిధిలో లక్ష డబుల్ బెడ్ రూం ఇండ్లను రూ.9,700 కోట్లను వెచ్చించి నిర్మిస్తున్నదన్నారు. ఎవరికీ రూపాయి లంచం ఇవ్వకుండా.. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ప్రభుత్వం పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేసి ఉచితంగా ఇండ్లను అందజేస్తున్నదన్నారు.
ప్రతిపక్షాల విష ప్రచారాన్ని నమ్మొద్దు..
మానవ రహితంగా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఆన్లైన్ ప్రక్రియ ద్వారా రాజకీయాలకతీతంగా డబుల్ బెడ్ రూం లబ్ధ్దిదారులను ఎంపిక చేస్తుండగా..ప్రతిపక్ష పార్టీలు ప్రజల్లో లేనిపోని అపోహలు సృష్టిస్తున్నాయని మండిపడ్డారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయీ తేలేని ఆ పార్టీ నాయకులు డబుల్ బెడ్రూం ఇండ్ల విషయంలో ఎందుకు ధర్నాలు చేస్తున్నా రో! అర్థంకావడం లేదని ఎద్దేవా చేశారు. పేదలకు ఇండ్లను అందజేస్తుంటే ఉనికిని కోల్పోతామన్న భావనతోనే బీజేపీ నేతలు విషప్రచారం చేస్తూ విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వస్తే గృహ నిర్మాణం కోసం రూ.5 లక్షలు ఇస్తామని కాంగ్రెస్ అంటున్నదని, మోసపూరిత హామీలను నమ్మి మోసపోవద్దని మంత్రి ప్రజలకు సూచించారు. కాంగ్రెస్ పార్టీ గతంలో ఇంటి నిర్మాణానికి రూ. 60వేలు మాత్ర మే ఇచ్చిందని, అప్పుడు నేను అదే పార్టీలో ఉన్నానని మంత్రి గుర్తు చేశారు. డబుల్ బెడ్రూం ఇండ్ల పథకం అనేది నిరంతర ప్రక్రియ అని పేదలందరికీ ఇండ్లను అందజేసే వరకు ఈ పథకం కొనసాగుతుందన్నారు. ఇండ్లు రాని వారు ఆందోళన చెందొద్ద ని స్థలం ఉన్న వారు ఇంటిని నిర్మించు కునేందుకు ప్రభుత్వం రూ.3 లక్షల సాయాన్ని గృహలక్ష్మి పథ కం కింద అందజేస్తున్నదన్నారు. ప్రజలందరూ సీఎం కేసీఆర్ వెన్నంటే ఉండాలని, పనిచేసే ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలని కోరా రు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, ఎమ్మెల్సీలు వాణీదేవి, దయానంద్ గు ప్తా, ఎగ్గె మల్లేశం, కలెక్టర్ హరీశ్ పాల్గొన్నారు.
రాజకీయాలకతీతంగా లబ్ధిదారుల ఎంపిక
పెద్దఅంబర్పేట, సెప్టెంబర్ 21: దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా సీఎం కేసీఆర్ తెలంగాణలో పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తున్నారని హోంమంత్రి మహమూద్అలీ అన్నారు. గురువారం పెద్దఅంబర్పేట మున్సిపాలిటీ తట్టిఅన్నారంలో జీహెచ్ఎంసీ పరిధిలో పేదలకోసం నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డితో కలిసి లబ్ధిదారులకు ఆయన అందజేశారు. అనంతరం మహమూద్అలీ మాట్లాడుతూ నిరుపేదలకు ఉచితంగా డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీతో సీఎం కేసీఆర్ కలలుగన్న బంగారు తెలంగాణ సాకారమవుతున్నదన్నారు. రాజకీయాలకు అతీతంగా లబ్ధిదారుల ఎంపిక జరిగిందన్నారు. ఒక్కో ఇంటి ధర రూ.40-50 లక్షలు పలికేలా సుందరంగా నిర్మిం చి.. ఉచితంగా పంపిణీ చేస్తున్న సీఎంగా కేసీఆర్ దేశంలోనే పేరు పొందారని కొనియాడారు. రైతులకు ఉచితంగా కరెంటు సరఫరా చేస్తూ రైతు బాంధవుడిగా సీఎం కేసీఆర్ మారారన్నారు. తెలంగాణ ఏర్పడిన 9 ఏండ్లలోనే దేశంలోనే రాష్ర్టాన్ని నంబర్వన్గా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. రైతు ఆత్మహత్యలను అరికట్టారన్నారు. డబుల్ బెడ్రూం ఇండ్లు పొందిన లబ్ధిదారులందరూ ముఖ్యమంత్రి వెంటే ఉండాలన్నారు.
అందుబాటులో ఉంటా : ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి
రూ.లక్షల విలువైన డబుల్ బెడ్రూం ఇండ్లను ఉచితంగా అందజేసిన ఘనత సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లకే దక్కుతుందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయాల్లో మరిన్ని వసతుల కల్పన కోసం ఎప్పు డూ అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు. అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న మాట్లాడుతూ లబ్ధిదారులు ఇండ్లను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ సంపూర్ణారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మున్సిపాలిటీ అధ్యక్షుడు, కౌన్సిలర్ కృష్ణారెడ్డి, కౌన్సిలర్లు శ్రీధర్రెడ్డి, గీతారెడ్డి, అనుపమరెడ్డి, గీత, కోటేశ్వర్రావు, పరశురాం, హరిశంకర్, బీఆర్ఎస్ అబ్దుల్లాపూర్మెట్ అధ్యక్షుడు కిషన్గౌడ్, జిల్లా అదనపు కలెక్టర్ భూపాల్రెడ్డి, ఇబ్రహీంపట్నం ఆర్డీవో అనంతరెడ్డి, అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ రవీందర్, మున్సిపల్ కమిషనర్ రవీందర్రెడ్డి, బలరాం, విజయ్భాస్కర్రెడ్డి, దామోదర్, రాము పాల్గొన్నారు.
1168 ఇండ్ల పట్టాల పంపిణీ
తట్టిఅన్నారంలో ఏడు బ్లాకుల్లో కలిపి మొత్తం 1268 డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించారు. ఇందులో గురువారం 1,168 మంది లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలు అందజేశారు. వీరిలో చార్మినార్ నియోజకవర్గానికి చెందిన 500 మంది, చాంద్రాయణగుట్ట నియోజకవర్గానికి చెందిన 500 మంది, మలక్పేట నియోజకవర్గానికి చెందిన 168 మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరిగిందన్నారు.
ధనవంతుల తరహాలో నిరుపేదలకు సొంతిండ్లు
ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 21 : హైదరాబాద్ విశ్వనగరంతోపాటు శివారు ప్రాంతాల్లో నివసిస్తున్న పేదలకు ధనవంతుల తరహాలో ప్రభుత్వం ఇండ్లు నిర్మించి ఇస్తున్నదని.. ఎవరికి కేటాయించిన ఇండ్లల్లో వారే నివాసముండి కొత్త జీవితాన్ని ప్రారంభించాలని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలు, గనులు, భూగర్భ శాఖల మం త్రి పట్నం మహేందర్రెడ్డి అన్నారు. గురువారం నియోజకవర్గంలోని పెద్దఅంబర్పేట మున్సిపాలిటీలోని హట్టిగూడలో ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను ఆయన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి తో కలిసి ప్రారంభించి, లబ్ధిదారులకు పట్టాలకు అందజేశా రు. అనంతరం మంత్రి మాట్లాడుతూ పేదల సొంతింటి కలను నెరవేరాలనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ జీహెచ్ఎంసీ పరిధిలో రూ.10 వేల కోట్లతో లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి వా టిని పేదలకు అందించటం ఎంతో సంతోషకరమన్నారు. హైదరాబాద్ నగరంలోని అన్ని నియోజకవర్గాల్లో ఇండ్లులేని నిరుపేదలకు సొంతింటిని నిర్మించి ఇవ్వాలనే ఉద్దేశంతోనే నగర శివారులోని రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో లక్ష డబుల్ బెడ్ రూంల నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. పేదలకు ధనవంతుల ఇండ్ల తరహాలోనే విశాలంగా నిర్మించడం హర్షణీయమన్నారు. లబ్ధిదారులు తమకు కేటాయించిన ఇండ్ల ల్లో వారే ఉండాలని .. వాటిని ఇతరులకు విక్రయించొద్దని సూచించారు. సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చర్యలతో రాష్ట్రం అన్ని రంగాల్లో అద్భుతమైన ప్రగతిని సాధిస్తున్నదని.. దీంతో దేశంలోని అన్ని రాష్ర్టా లు మన రాష్ట్రంవైపు చూస్తున్నాయన్నారు. ఇంటింటికీ అందుతున్న ప్రభుత్వ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. రంగారెడ్డి జిల్లాలో 23,260 ఇండ్లు నిర్మించగా అందులో ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో 9,872, మహేశ్వరంలో 9,872, రాజేంద్రనగర్లో 696, ఎల్బీనగర్లో 944, శంకర్పల్లిలో 1,512, శేరిలింగంపల్లిలో 3044 నిర్మించి ఇస్తున్నట్లు తెలిపారు. ఈ ఇండ్ల కేటాయింపులో ఎలాంటి పక్షపాతం చూపకుండా.. పార్టీలకతీతంగా లబ్ధిదారులకు కేటాయిస్తున్నట్లు మంత్రి వివరించారు. అలాగే, ముఖ్యమంత్రి హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని కొనియాడా రు. రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణంతోపాటు మౌలిక వసతు ల కల్పనకు రూ. లక్షల కోట్ల నిధులను కేటాయిస్తున్నారని అన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా సీ ఎం కేసీఆర్ పేదలకు ఇండ్ల నిర్మాణంతోపాటు సంక్షేమ పథకాలను అందించి ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు.
లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలి
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పేదలను ధనవంతులనే చేయాలనే ఉదేశ్యంతోనే అన్ని హంగులతో నిర్మించి ఇస్తున్న డబుల్బెడ్రూం ఇండ్లను సద్వినియోగం చేసుకుని లబ్ధిదారులంతా ముఖ్యమంత్రికి అండగా నిలువాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేదన్నారు. సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చర్యలతో హైదరాబాద్తోపాటు చుట్టుపక్కల ప్రాంతా ల్లోనూ అభివృద్ధి శరవేగంగా జరుగుతున్నదని.. దేశ, విదేశాలకు చెందిన కంపెనీలు, సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తు న్నాయన్నారు. హట్టిగూడలో నిర్మించిన 332 ఇండ్లల్లో గ్రౌండ్ఫ్లోర్ లో 12మంది వికలాంగులకు కేటాయించారు, ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల వారీగా ఇండ్లను కేటాయించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ చెవుల స్వప్న, రంగారెడ్డి అదనపు కలెక్టర్ భూపాల్రెడ్డి, హైదరాబాద్ డీఆర్వో వెంకటాచారి, ఇబ్రహీంపట్నం ఆర్డీవో అనంతరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు రాంరెడ్డి, కిషన్గౌడ్, ప్రభాకర్రెడ్డి పాల్గొన్నారు.
అర్హులందరికీ డబుల్ ఇండ్లు
తుర్కయాంజాల్, సెప్టెంబర్ 21: అర్హులందరికీ ప్రభు త్వం డబుల్ బెడ్రూం ఇండ్లను పంపిణీ చేస్తున్నదని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. గురువారం అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని కుత్బుల్లాపూర్ గ్రామ పంచాయతీ పరిధి తిమ్మాయిగూడెంలో రెండో విడుత డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీని ఆమె ప్రారంభించి.. లబ్ధిదారులకు ఇండ్ల పట్టా లు అందజేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ప్రభుత్వం దశలవారీగా అర్హులందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లను పంపిణీ చేస్తున్నదని.. మొదటి, రెండో విడుతల్లో ఇండ్లు రాని వారు నిరుత్సాహం చెందొద్దదన్నారు. హైదరాబాద్లో ప్రభుత్వం లక్ష ఇండ్లను నిర్మించగా.. మొదటి విడుతలో 11000, రెండో విడుతలో 13,300 ఇండ్లను అత్యంత పారదర్శకంగా లబ్ధిదారులకు కేటాయించామన్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యే యంగా ముందుకు సాగుతున్నదని కొనియాడారు. తు మ్మాయిగూడలో దివ్యాంగులకు 24, ఎస్సీలకు 83, ఎస్టీలకు 29 ఇతరులకు 324 ఇండ్లను పంపిణీ చేశామన్నా రు. అనంత రం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ హయాంలో పేదలకు న్యాయం జరుగుతున్నదన్నారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ అసిస్టెంట్ కమిషనర్ స్నేహ, హైదరాబాద్ అదనపు కలెక్టర్ మధుసూదన్, అధికారులు వెంకటాచారి, ఇబ్రహీంపట్నం ఆర్డీవో అనంతరెడ్డి, కార్పొరేటర్, తహసీల్దార్ రవీందర్, అబ్దుల్లాపూర్మెట్ ఎంపీపీ రేఖ, జడ్పీటీసీ దాస్, సర్పంచ్ స్వరూప తదితరులు పాల్గొన్నారు.
కలలో కూడా ఊహించుకోలేదు..
నాకంటూ ఒక సొంతిల్లు ఉంటుందని కలలో కూడా అనుకోలేదు. అలాంటిది, సీఎం కేసీఆర్ సార్ పుణ్యాన సొంతింటి కల నెరవేరింది. లక్షలు ఖర్చు చేసి పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించివ్వడం గొప్ప విషయం. రెక్కాడితేగానీ డొక్క నిండని పరిస్థితి ఉన్న మా కుటుంబానికి ఈ ఇల్లు దక్కడం ఎంతో ఆనందంగా ఉన్నది. మా లాంటి పేదోళ్లకు ఉచితంగా ఇండ్లు ఇస్తున్న ముఖ్యమంత్రి సార్కు ఎప్పటికీ రుణపడి ఉంటాం.
-శోభమ్మ, లబ్ధిదారు, హట్టిగూడ, పెద్దఅంబర్పేట మున్సిపాలిటీ
సొంతింటిలో ధైర్యంగా జీవిస్తాం..
సీఎం కేసీఆర్కు పేదల కష్టాలు తెలుసు. ఆయన మనసున్న మంచి మనిషి. నాలాంటి పేదల ఇంటి కష్టాలను తొలగించేందుకు డబుల్ బెడ్రూం ఇం డ్లను నిర్మించి ఉచితంగా పంపిణీ చేయడం సంతోషకరం. ఆయన రుణం ఎప్పుడూ తీర్చుకోలేను. ఇక నుంచి సొంత ఇంటిలో ధైర్యంగా బతుకుతా. రాష్ర్టాభివృద్ధి ఆయనతోనే సాధ్యం. పేదలకు అండగా ఉంటున్న ఆయన్ను రానున్న ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించుకోవాలి.
-మల్లయ్య, లబ్ధిదారు ఇబ్రహీంపట్నం
ఫుల్ హ్యాపీ..
ఫుల్ హ్యాపీగా ఉన్నది. మేం నలుగురు కుటుంబసభ్యులం. నేను దివ్యాంగురాలిని. సాయం లేనిదే నడవలేను. నాలాంటి వారికి ఇల్లు ఇచ్చి నన్ను నడిపిస్తున్నారు సీఎం కేసీఆర్ సార్. డబుల్ బెడ్ రూం ఇండ్ల ఎంపిక చాలా బాగా జరిగింది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగా జాబితాలో నా పేరు వచ్చింది. నిజంగా నమ్మలేకపోతున్నా. గరీబోళ్లకే ఇండ్లను కేటాయించా రు. ఆన్లైన్తోనే ఇది సాధ్యమైనది.
– రహీమా, డబుల్ బెడ్రూం ఇంటి లబ్ధిదారు (తట్టిఅన్నారం)
సీఎం కేసీఆర్ సార్కు షుక్రియా
సీఎం కేసీఆర్ సార్కు బహుత్ బహుత్ షుక్రియా. నాకు చిన్నప్పుడే పోలియో వచ్చింది. కనీసం నిలబడలేను. ఎవరైనా వచ్చి ఎత్తుకుని పోతేనే వెళ్తా. నా భర్త చనిపోయాడు. నాకు ఇద్దరు ఆడ పిల్లలు, ఒక కొడుకు ఉన్నాడు. కిరాయి ఇంట్లోనే ఉంటున్నా. కొన్నేండ్లుగా కిరాయి కట్టడంతో నాలుగు పైసలు కూడా వెనుకేసుకోలేదు. ఇప్పుడు ఉచితంగానే డబుల్ బెడ్రూం ఇల్లు ఇచ్చి సీఎం కేసీఆర్ నా కలను నెరవేర్చారు. చాలా సంతోషం.
– జరీనా బేగం, డబుల్ బెడ్రూం ఇంటి లబ్ధిదారు (తట్టిఅన్నారం)
సీఎం సారు ఇల్లు ఇచ్చి ఆదుకున్నారు..
సీఎం కేసీఆర్ ప్రభుత్వం మా కుటుంబానికి డబుల్ బెడ్రూం ఇంటిని కేటాయించడం చాలా సంతోషక రం. ఇప్పటివరకు కిరాయి ఇండ్లల్లో ఉంటూ జీవిం చాం. మాకు వచ్చే అరకొర జీతంలో సగం ఇంటి అద్దెకే సరిపోయేది. దీంతో జీవించడం ఇబ్బందిగా మారింది. ఉచితంగా ఇంటిని కేటాయించిన తెలంగాణ ప్రభుత్వానికి జీవితాంతం రుణపడి ఉంటా. పేదల బాగుకు కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ దేవుడు.
– దేవమ్మ, మహేశ్వరం గ్రామం
ముఖ్యమంత్రికి రుణపడి ఉంటా..
ధనవంతులు నివసిస్తున్న ఇండ్ల మధ్యలోనే మాకు కూడా డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్కు రుణపడి ఉంటా. సొం తింటిని నిర్మించుకోవాలని కొన్నేండ్లుగా అనుకుంటున్నా ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడంతో నిర్మించుకోలేక. కానీ, సీఎం కేసీఆర్ తన సొం తింటి కలను నెరవేర్చారు. ఆయనకు రుణపడి ఉంటా. ఇక నుంచి కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జీవిస్తా.
-వరలక్ష్మి, లబ్ధిదారు ఇబ్రహీంపట్నం
ఇరుకు గదిలోనే ఇప్పటివరకు..
మాది ఉమ్మడి కుటుంబం. ఉన్న చిన్న ఇంట్లోనే కుటుంబం మొత్తం జీవించేది. పిల్లలు పెరుగడంతో ఇబ్బందిగా మారింది. ఈ పరిస్థితిలో సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూంను ఇచ్చి మా సొంతింటి కలను తీర్చారు. గజం స్థలం కూడా కొనలేని నాలాంటి వారికి 20 నుంచి రూ.30వేలు గజం ఉన్న ఖరీదైన ప్రాంతంలో ఇల్లు నిర్మించి ఇవ్వడం సంతోషకరం.
-పద్మ, లబ్ధిదారు ఇబ్రహీంపట్నం
సీఎం కేసీఆర్ సల్లంగా ఉండాలి. .
సీఎం కేసీఆర్ మా ఇంటికి మార్గదర్శకుడిగా నిలిచారు. మాది మధ్యతరగతి కుటుంబం. నా భర్త ఫ్యాబ్సిటీలో ఉద్యోగం చేసి రిటైర్డ్ అయ్యారు. చాలీచాలని జీతంతో బతుకుతున్న మాకు సీఎం కేసీఆర్ డబుల్ బెడ్ రూం ఇల్లు ఇచ్చి ఆదుకున్నారు. ఇప్పటివరకు కిరాయి ఇంట్లో ఉంటూ ఇబ్బంది పడ్డాం. పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వం మాకు ఇంటి పట్టా ను అందించడం చాలా సంతోషకరం. సీఎం కేసీఆర్ సల్లంగా ఉండాలి. రాష్ర్టాభివృద్ధి ఆయనతోనే సా ధ్యం. రానున్న ఎన్నికల్లోనూ ఆయన భారీ మెజార్టీతో గెలుపొందుతారు.
-విజయలక్ష్మి తుక్కుగూడ, మహేశ్వరం
సొంతింటి కల నెరవేరింది
సైదాబాద్ ప్రాంతంలో గత 20 ఏండ్లుగా అద్దె ఇం ట్లో కుటుంబంతో కలిసి జీవిస్తున్నా. అద్దె చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు పడ్డా.. ముఖ్యంగా కరోనా సమయంలో ఇంటి యజమానులు విధించిన షరతులను మరిచిపోలేను. ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇంటిని కేటాయించడంతో నా సొంతింటి కల కల నెరవేరింది. ఇల్లు మంజూరు కావడంతో నా కుటుంబంలో ఆనందానికి అవధుల్లేవు.
-పల్లవి,సైదాబాద్
కుటుంబ సభ్యులతో ఆనందంగా జీవిస్తా
యాకత్పురలో గత 30 ఏండ్లుగా అద్దె ఇంటిలో జీవిస్తున్నా. సొంతింటిని నిర్మించుకుందామంటే ఆర్థిక పరిస్థితి సహకరించడం లేదు. సీఎం కేసీఆర్ ప్రభు త్వం డబుల్ బెడ్రూం ఇంటిని కేటాయించి నా సొం తింటి కలను నెరవేర్చింది. ఇల్లు రావడంతో నాకు ధైర్యం పెరిగింది. ఇక నుంచి అద్దె ఇంటి బాధలు తప్పుతాయి. కుటుంబ సభ్యులమంతా ఆనందంగా జీవిస్తాం.
-వహీదా ఉన్నిసా, యాకత్పుర
సర్కారు దయతోనే ఇల్లు వచ్చింది.. తెలంగాణ సర్కారు దయతోనే నాకు డబుల్ బెడ్ రూం ఇల్లు వచ్చింది. రూపాయి ఖర్చు లేకుండా రూ. లక్షల విలువైన ఇంటిని కేటాయించిన ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు. అన్ని కులాలు, మతాలకు సమ న్యాయం చేస్తున్న సీఎం కేసీఆర్ పాలననే తిరిగి రావా లి. ఆయన మూడోసారి కూడా సీఎం కావాలి.
-అఫ్రిన్బేగం, రామచంద్రగూడ, మహేశ్వరం