HomeRangareddyMinister Sabitha Indra Reddy Unveiled The National Flag At The Collectorate
అన్ని రంగాల్లో అగ్రగామిగా..
తొమ్మిదేండ్ల సీఎం కేసీఆర్ పాలనలో అంతులేని అభివృద్ధి జరిగిందని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, గ్రామ పంచాయతీల్లో జాతీయ జెండా ఆవిష్కరణలతో పండుగ వాతావరణం కనిపించింది.
దేశానికే ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం
పారిశ్రామిక ప్రగతిలో జిల్లా అగ్రస్థానం
యువతకు మెరుగుపడిన ఉద్యోగావకాశాలు
దశాబ్ది ఉత్సవాల్లో విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి
జిల్లావ్యాప్తంగా ఘనంగా ప్రారంభమైన రాష్ట్ర అవతరణ వేడుకలు
కలెక్టరేట్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన మంత్రి
తొమ్మిదేండ్ల సీఎం కేసీఆర్ పాలనలో అంతులేని అభివృద్ధి జరిగిందని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, గ్రామ పంచాయతీల్లో జాతీయ జెండా ఆవిష్కరణలతో పండుగ వాతావరణం కనిపించింది. జిల్లా కలెక్టరేట్లో జరిగిన ఉత్సవాలకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సుపరిపాలనలో గ్రామాలు, పట్టణాలు సకల వసతులతో కళకళలాడుతున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదన్నారు. రంగారెడ్డి జిల్లా ప్రగతి దిశగా పరుగులు పెడుతున్నదన్నారు. పారిశ్రామిక అభివృద్ధిలో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో ఉన్నదన్నారు. పెద్ద ఎత్తున కంపెనీలు ఏర్పాటవుతుండడంతో జిల్లాలో ఉద్యోగావకాశాలు మెరుగుపడుతున్నాయన్నారు. ఇప్పటివరకు టీఎస్ ఐ పాస్ ద్వారా 1252 పరిశ్రమలు స్థాపించగా.. 5,15,851 మందికి ఉపాధి లభించిందన్నారు. రూ.47,062 కోట్ల పెట్టుబడులు సమకూరాయన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతుబీమా, రైతుబంధు వంటి ఎన్నో పథకాలతో ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. ఉత్సవాల్లో తెలంగాణ సంస్కృతీసంప్రదాయాలు ప్రతిబింబించేలా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
-రంగారెడ్డి, జూన్ 2 (నమస్తే తెలంగాణ)
రంగారెడ్డి, జూన్ 2(నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రం అమరుల త్యాగఫలం..కేసీఆర్ పోరాట ఫలితమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదో ఏడాదిలోకి అడుగుపెట్టిన సందర్భం గా రంగారెడ్డి జిల్లాలో తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. కొంగరకలాన్లోని రంగారెడ్డి కలెక్టరేట్లో జరిగిన ఉత్సవాలకు మంత్రి సబితారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ జెం డాను ఆవిష్కరించి ఉత్సవాలను ప్రారంభించి మాట్లాడారు. తొమ్మిదేండ్లలో జిల్లా సాధించిన ప్రగతి నివేదికతోపాటు రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను వివరించారు. ఉమ్మడి ప్రభుత్వాల పాలనలో తెలంగాణ ప్రజ లు అణచివేతకు, దోపిడీకి గురయ్యారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తప్ప తలరాత మారదనే వాస్తవాన్ని గ్రహించి జూన్ 2, 2014న స్వరాష్ర్టాన్ని సాధించుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమర వీరులందరికీ మంత్రి ఘన నివాళులర్పించారు.
సీఎం కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ ప్రభు త్వం తొమ్మిదేండ్ల స్వల్ప కాలంలోనే ప్రజా సంక్షేమం, అభివృద్ధిలోనూ యావత్ దేశానికే ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిచిందన్నా రు. ‘తెలంగాణ ఆచరిస్తుంది- దేశం అనుసరిస్తుంది’ అని చెప్పుకొనే స్థాయికి మన రాష్ట్రం చేరుకోవడం రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణమని మంత్రి అన్నారు. తొమ్మిదేండ్లలో సీఎం కేసీఆర్ అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారన్నారు. తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్ర పరిస్థితి దయనీయంగా ఉందని.. రాష్ట్ర ఏర్పాటుకు ముందు రెండేండ్ల కాలంలో జీఏసీడీపీ వార్షిక వృద్ధి రేటు 12% మాత్రమేనని..ఇది జాతీయ వృద్ధి రేటు అయిన 13.4% కంటే తక్కువేనని పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం తీసుకున్న చర్యలతో జీఏసీడీపీ క్రమేణా పెరుగుతూ వచ్చిందన్నారు. 2014-15నుంచి 2019-20 వరకు జిల్లా వార్షిక జీఏసీడీపీ వృద్ధి రేటు 17.2 శాతానికి పెరిగిందన్నారు. అదేవిధంగా జిల్లా తలసరి ఆదాయం 2014-15లో రూ. 2,83,636 ఉండగా, 2020-21లో రూ.6,69,102 ఉందని.. తలసరి ఆదాయంలో రాష్ట్రంలోనే రంగారెడ్డి మొదటి స్థానంలో నిలిచిందన్నారు.
వ్యవసాయం రంగం..
సీఎం కేసీఆర్ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యమిస్తున్నది. రైతు సంక్షేమమే ధ్యేయంగా ‘రైతుబంధు, రైతుబీమా, పంట రుణాలమాఫీ, ఇన్ఫుట్ సబ్సి డీ, ఉచిత విద్యుత్, గోదాంల నిర్మాణం, పంట పొలాలకు సమృద్ధిగా సాగు నీరు అందిస్తున్నది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో వ్యవసాయం పండుగలా మారిందని మంత్రి తెలిపారు.
పరిశ్రమలు-అభివృద్ధి..
రాష్ట్రం జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులకు స్వర్గధామంగా మారిందని.. ప్రభుత్వం తీసుకొచ్చిన టీఎస్-ఐ పాస్ చట్టం విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చిందని మం త్రి పేర్కొన్నారు. పరిశ్రమల స్థాపనకు సంబంధించిన అనుమతుల ప్రక్రియ అత్యంత సులభతరంగా మారిందన్నారు. 24 గంటల విద్యుత్తు, మెరుగైన శాంతిభద్రతలు, సమర్థ్ధవంతమైన పరిపాలన నెలకొన్నందున జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు కొత్త పరిశ్రమల ఏర్పాటుకు తెలంగాణకు తరలివస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో ఇప్పటివరకు టీఎస్-ఐపాస్ ద్వారా 1,715 పరిశ్రమల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకోగా, 1,252 పరిశ్రమలు రూ. 47౦62 కోట్ల పెట్టుబడితో స్థాపించబడి 5,15,851 మం దికి ఉపాధిని కల్పించినట్లు వివరించారు. పారిశ్రామిక అభివృద్ధిలో రంగారెడ్డి జిల్లా నానాటికీ ముందంజలో నిలుస్తున్నదన్నారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇంటింటికీ అందుతున్నాయని..దీంతో ప్రతి ఒక్కరూ సంతోషం గా ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు. కాగా జిల్లా జీవనజ్యోతి మహిళా సమాఖ్యకు రూ.59కోట్ల 22 లక్షలు, ఇంకా మరో రూ.17కోట్ల చెక్కులను మంత్రి అందజేశారు. అలాగే కు లాంతర వివాహం చేసుకున్న రెండు జంటలకు సోషల్ వె ల్ఫేర్ శాఖ తరఫున చెక్కులను అందజేశారు. ఈ సందర్భం గా విద్యార్థినులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమా లు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో జడ్పీచైర్ పర్సన్ అనితాహరినాథ్రెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి, కలెక్టర్ హరీశ్, అదనపు కలెక్టర్లు ప్రతీక్జైన్, తిరుపతి రావు, అమరుడైన శ్రీకాంతాచారి మాతృమూర్తి శంకరమ్మ, అధికారు లు, ప్రజాప్రతినిధులు, స్థానికులు పాల్గొన్నారు.
కలెక్టరేట్లో పౌర గ్రంథాలయం ప్రారంభం
ఇబ్రహీంపట్నం, జూన్ 2 : ప్రజలకు మరింత చేరువయ్యేలా గ్రంథాలయ సేవలను విస్తరిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. కొంగరకలాన్లోని రంగారెడ్డి కలెక్టరేట్ భవన సముదాయంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఏర్పాటు చేసిన పౌర గ్రంథాలయాన్ని శుక్రవారం ఆమె ప్రారంభించి మాట్లాడారు. వివిధ పనులపై కలెక్టరేట్కు వచ్చే ప్రజలకు ఈ లైబ్రరీ ఎంతో దోహదపడుతుందన్నారు. కంప్యూటర్లు, స్మార్ట్ఫోన్ల వినియోగంతో గ్రంథాలయాల వినియోగం కొంత తగ్గగా.. ఇటీవల ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తుండటంతో ఉద్యోగార్థులు గ్రంథాలయాలకు క్యూ కడుతున్నారన్నారు. నిరుద్యోగులకు అవసరమయ్యే అన్ని పుస్తకాలను గ్రంథాలయాల్లో సిద్ధంగా ఉంచామని చెప్పారు. గ్రంథాలయాల సేవలను పల్లెలకు కూడా విస్తరించేందుకే పౌర పఠన మందిరాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.
మొదటి విడుతగా 30 పఠన మందిరాలను జిల్లా గ్రంథాలయ సంస్థ ఏర్పాటు చేసిందని, తెలంగా ణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 20న వాటిని ప్రారంభిస్తామని తెలిపారు. జిల్లాలోని ఎమ్మెల్యేలతో చర్చించి రెండో విడుతలో మరో 50 పఠన కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో రూ.9 కోట్లతో చేపడుతున్న నూతన గ్రంథాలయ భవనాల నిర్మాణ పనులు తది దశకు చేరాయన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ హరీశ్, అదనపు కలెక్టర్లు ప్రతీక్జై న్, తిరుపతిరావు, గ్రంథాలయాల సంస్థ జిల్లా చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, కార్యదర్శి మనోజ్కుమార్, అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ, డీఆర్వో హరిప్రియ, డీపీవో శ్రీనివాస్రెడ్డి, గణేశ్, గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు.
ట్రాన్స్జెండర్లకు రుణాలు
దశాబ్ది ఉత్సవాల సందర్భంగా కలెక్టర్ హరీశ్ కలెక్టరేట్ వద్ద జరిగిన వేడుకలో భాగంగా మంత్రి సబితారెడ్డి చేతుల మీదుగా ఏడుగురు ట్రాన్స్జెండర్లకు 100% సబ్సిడీతో రూ.50 వేల రుణ సదు పాయం, ఆర్థిక పునరావాస పథకం (ఈఆర్ఎస్)లో భాగంగా చెక్కులను అందించారు. ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ అధికారిణి పద్మజారమణ మాట్లాడుతూ రాష్ట్రంలో మొదటిసారిగా దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్జెండర్ల సాధికారత శాఖ నుంచి ఈ లోన్కు సంబంధించిన చెక్కులను రంగారెడ్డి జిల్లాలోని ట్రాన్స్జెండర్లకు ఇవ్వడం జరిగిందన్నారు. కార్యక్రమంలో వీటితోపాటు మందగడ్డ వేణుకు కూడా రూ.50 వేల చెక్కును (దివ్యాంగుల ఆర్థిక పునరావాస పథకం కింద) 100 శాతం సబ్సిడీతో అందజేసినట్లు తెలిపారు.