బడంగ్పేట, ఏప్రిల్ 2 : ‘పాలమూరు ప్రాజెక్టు పనులను పూర్తి చేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు.. తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి..’ అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. ఆదివారం అల్మాస్గూడలోని అడివిరెడ్డి గార్డెన్స్లో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి హాజరైన మంత్రిని బీఆర్ఎస్ శ్రేణులు గజమాలతో సత్కరించారు. అల్మాస్గూడ ప్రాంతమంతా గులాబీమయమైంది. అనంతరం నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ కోమటికుంట, పోచమ్మకుంటతో పాటు ప్రతి చెరువునూ సుందరీకరిస్తున్నామన్నారు. తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. 58, 59 జీవోల కింద ఇప్పటికే లక్ష పట్టాలిచ్చామని తెలిపారు. తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలో పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటవుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఉప్పరిగూడలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి మాట్లాడుతూ స్వరాష్ట్రంలోనే ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అభివృద్ధి చెందిందన్నారు. నియోజకవర్గంలో పరిశ్రమలు ఏర్పాటు కావడం వల్లే ఇక్కడి భూములకు డిమాండ్ వచ్చిందని, ఎన్నో ఉద్యోగాలు వచ్చాయని తెలిపారు. షాద్నగర్ పట్టణంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే వై.అంజయ్యయాదవ్ మాట్లాడుతూ దేశంలోనే తెలంగాణ అభివృద్ధి అగ్రగామిగా ఉందన్నారు. ప్రతి గడపకూ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని తెలిపారు.
ప్రజలను మోసం చేయడం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య అని విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఆదివారం బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అల్మాస్గూడలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అల్మాస్గూడ ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేశారు. అనంతరం అల్మాస్గూడ నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. వైఎస్ఆర్ చౌరస్తాలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు సంరెడ్డి వెంకట్రెడ్డి, రామిడి రాంరెడ్డి, ఏనుగు రాంరెడ్డి, ముత్యాల లలితాకృష్ణ, బోయపల్లి దీపికాశేఖర్రెడ్డి గజమాలతో మంత్రిని ఘనంగా సత్కరించారు. దూంధాం కళాకారులు ఆటపాటలతో అందరినీ అలరించారు. ఈ సమావేశానికి సంరెడ్డి వెంకట్రెడ్డి అధ్యక్షత వహించారు. బీఆర్ఎస్ నేత రామిడి రాంరెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహేశ్వరం నియోజక వర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి బీజేపీ నాయకులు ఓర్వలేక పోతున్నారని మండి పడ్డారు. చెరువులను సుందరీకరిస్తుంటే కబ్జాలు చేస్తున్నారని తప్పుడు ప్రచారం చేయడం సరికాదని అన్నారు. కోమటి కుంటను రూ.2..50కోట్లతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. పోచమ్మ కుంటను కోటి రూపాయలతో సుందరీకరణ చేస్తున్నట్లు పేర్కొన్నారు. అల్మాస్గూడలో ఇప్పటికే రూ.8కోట్లతో అభివృద్ధి చేసినట్లు తెలిపారు. అల్మాస్గూడలో ఉన్న గ్రీన్ జోన్ను తొలగించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని ఆమె పేర్కొన్నారు. 58, 59 జీవోల ద్వారా క్రమబద్ధీకరణ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే లక్ష పట్టాలు ఇవ్వడం జరిగిందన్నారు. పెండింగ్ దరఖాస్తులను పరిశీలిస్తామన్నారు. తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలో పాలిటెక్నిక్ కళాశాలను ఏర్పాటు చేయిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. త్వరలోనే మహేశ్వరం నియోజకవర్గంలో మేగా జాబ్ మేళాను నిర్వహిస్తామన్నారు.
వెయ్యి ఎకరాల్లో వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పచ్చని చెట్లు కాపాడాలన్న లక్ష్యంతో అటవీ ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. రాష్ట్రం పై సంపూర్ణ అవగాహన ఉన్న నాయకుడు సీఎం కేసీఆర్ అని అన్నారు. పాలమూరు ప్రాజెక్టును అభివృద్ధి చేస్తే లక్షల మంది రైతులకు ఉపయోగ పడుతుందన్నారు. ఎన్ని అడ్డుంకులు వచ్చినా సీఎం కేసీఆర్ పాలమూరు ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తారన్నారు. గతంలో 138 సర్వేనంబర్లో ఇచ్చిన పట్టాలు ఇచ్చారన్నారు. ముఖ్యమంత్రితో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.
సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం
రాష్ట్రంలో అమలు అవుతున్న పథకాలు దేశానికే ఆదర్శమని కేంద్ర గ్రంథాలయ చైర్మన్ అయాచితం శ్రీధర్ అన్నారు. బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నదన్నారు. గ్యాస్, పెట్రోలు ధరలు పెంచి పేదల నడ్డి విరుస్తున్నదని ఆరోపించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మహేశ్వరం నియోజకవర్గ ఉపాధ్యక్షుడు ఎన్. నరేందర్గౌడ్, కార్పొరేటర్లు ఆర్.కవితారాంరెడ్డి, ఎస్.స్వప్నా వెంకట్రెడ్డి, ఎం.లలితాకృష్ణ, ఎ.రాంరెడ్డి, బి.దీపికాశేఖర్రెడ్డి, ఎస్. అర్జున్, సంతోశ్రెడ్డి, కె.నాగేందర్, వాణి, నేతలు శ్రీపాల్రెడ్డి, ఉపేందర్రెడ్డి, రోహిత్రెడ్డి, యాదగిరి పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు ;ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు లభించిందని బీఆర్ఎస్ రంగారెడ్డిజిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. ఆదివారం ఉప్పరిగూడ సమీపంలోని కేఎంఆర్ ఫంక్షన్హాల్లో బీఆర్ఎస్ ఇబ్రహీంపట్నం మండల అధ్యక్షుడు చిలుకల బుగ్గరాములు అధ్యక్షతన నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలోనే గుర్తింపుపొందిన టాటా కన్సెల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)ను మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరువతోనే ఇబ్రహీంపట్నంలో ఏర్పడిందన్నారు. ఆదిబట్లలో టీసీఎస్తో పాటు మరిన్ని ఎరోస్పేస్సంస్థలు వచ్చాయని అన్నారు. త్వరలోనే ఎలిమినేడులో మరో ఎరోస్పేస్సంస్థ రానున్నాయన్నారు. అలాగే, కొంగరకలాన్ సమీపంలో అతిపెద్ద ఫాక్స్కాన్ పరిశ్రమ కూడా ఏర్పాటు కానుందన్నారు. రైతులకు పెండింగ్లో ఉన్న రూ.90వేల వరకు రుణమాఫీ కానుందని తెలిపారు. వచ్చేనెల నుంచి ప్రతి గ్రామానికీ 30చొప్పున సొంత ఇండ్లు నిర్మించుకునేందుకు రూ.3లక్షల చొప్పున మంజూరు చేయనున్నట్లు తెలిపారు.
మెడికల్ కళాశాల ఏర్పాటుకు కృషి..
ఖగోళశాస్త్రంలోనే అతిపెద్ద పరిశోధన కేంద్రంగా జాపాల-రంగాపూర్ సమీపంలో ఉన్న అబ్జర్వేటరీ వద్ద మెడికల్ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఖగోళశాస్త్ర పరిశోధనకేంద్రం కోసం గతంలో ప్రభుత్వం 200ఎకరాల స్థలాన్ని కేటాయించిందన్నారు. అలాగే, తాళ్లపల్లిగూడ సమీపంలో ఉన్న మరో నాలుగువందల ఎకరాల ప్రభుత్వ భూమిలో కూడా పరిశ్రమల ఏర్పాటుకు ఇప్పటికే ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సుముఖత వ్యక్తం చేశారని అన్నారు.
అత్యధిక సభ్యత్వం కలిగిన పార్టీ బీఆర్ఎస్
దేశంలో ఏ పార్టీకి లేనంత సభ్యత్వాలు బీఆర్ఎస్పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా 60లక్షల పైచిలుకు సభ్యులు ఉన్నారని జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ సత్తువెంకటరమణారెడ్డి అన్నారు. ప్రతి ఒక్కరూ బీఆర్ఎస్ సంక్షేమ పథకాలపై ప్రజలకు వివరించి పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని సూచించారు.
ప్రజా సంక్షేమానికి బీఆర్ఎస్ పెద్దపీట
ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం బీఆర్ఎస్ కృషి చేస్తున్నదని పార్టీ రాష్ట్ర నాయకుడు క్యామ మల్లేశ్ అన్నారు. తోపుడు బండ్లు, రియాల్టర్ల వద్ద వసూళ్లు చేసే చిల్లరగాళ్లను ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఎద్దేవా చేశారు. నియోజకవర్గంలో మంచి పనులు చేస్తున్న మంచిరెడ్డికి ప్రజల మద్దతు ఎప్పుడూ ఉంటుందని తెలిపారు.
సమస్యలుంటే ఎమ్మెల్యే దృష్టికి తీసుకురండి
గ్రామాల్లో ఎలాంటి సమస్యలున్నా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్కుమార్రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రగతి నివేదనయాత్ర ద్వారా నియోజకవర్గంలో బీఆర్ఎస్ శ్రేణులు ఎలాంటి సమస్యలున్నా పరిష్కరిస్తున్నారని ఆయన తెలిపారు.
రైతాంగ ప్రయోజనాలకు పెద్దపీట
రైతుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి అన్నారు. దేశంలో రైతుల సమస్యలను పరిష్కరించేందుకు అబ్కీబార్ కిసాన్ సర్కారు నినాదంతో బీఆర్ఎస్ క్రియాశీలకపాత్ర పోషించనుందన్నారు. జిల్లా వ్యాప్తంగా రైతులతో మండలస్థాయిలో సమావేశాలు నిర్వహించి రైతులనంతా ఒక్కతాటిపైకి తీసుకువచ్చి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలపై చర్చించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ చైర్మన్ ఎ.చంద్రయ్య, ఎంపీపీ కృపేశ్, వైస్ఎంపీపీ ప్రతాప్రెడ్డి, సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు రాంరెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు భరత్రెడ్డి, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి భాస్కర్రెడ్డి, సహకార సంఘం చైర్మన్లు బి.వెంకట్రెడ్డి, మహేందర్రెడ్డి, సర్పంచ్లు బల్వంత్రెడ్డి, హంసమ్మ, గీతా, యాదగిరి, మల్లీశ్వరి, జ్యోతి, ఎంపీటీసీలు నాగమణి, మంగ, శ్రీశైలం, మార్కెట్కమిటీ డైరెక్టర్ ఎం. వెంకటేష్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
క్రమశిక్షణ కలిగిన పార్టీ బీఆర్ఎస్
క్రమశిక్షణ, అత్యధిక కార్యకర్తలు కలిగిన పార్టీ బీఆర్ఎస్. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి సారథ్యంలో ఇబ్రహీంపట్నం ప్రాంతంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టారు. ప్రతినిత్యం ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించి పార్టీకోసం, పార్టీబలోపేతం కోసం పనిచేసే విధంగా ప్రతినిత్యం ప్రోత్సహిస్తున్నారు. రానున్న రోజుల్లో ఇబ్రహీంపట్నం ప్రాంతంలో బీఆర్ఎస్ తిరుగులేని శక్తిగా మారటం ఖాయం.
– మంచిరెడ్డి ప్రతాప్రెడ్డి, ఇబ్రహీంపట్నం వైస్ఎంపీపీ