ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ఎజెండా అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి తెలిపారు. శనివారం కందుకూరు మండల కేంద్రంలో కుమ్మరుల సంఘం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితారెడ్డితో కలిసి హాజరై మాట్లాడారు. కులవృత్తుల అభ్యున్నతికి తెలంగాణ సర్కార్ పెద్దపీట వేస్తున్నదన్నారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ సుపరిపాలనలో అన్ని వర్గాలు అభివృద్ధిలోకి వస్తున్నాయన్నారు. కుమ్మరులు సంఘటితంగా ఉంటూ అన్ని రంగాల్లో రాణించాలని పిలుపునిచ్చారు. పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని సూచించారు.
-కందుకూరు, ఏప్రిల్ 29
కందుకూరు, ఏప్రిల్ 29 : ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ఎజెండా అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. శనివారం మండల కేంద్రంలోని సామ నర్సింహారెడ్డి ఫంక్షన్ హాలులో నియోజకవర్గ కుమ్మరుల సంఘం ఆత్మీయ సమ్మేళన సభ నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితారెడ్డితో కలిసి ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. కుల వృతులకు ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడిన అనంతరం సీఎం కేసీఆర్ ఎన్బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కుమ్మరులు సంఘటింతంగా ఉంటూ ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగాలని కోరారు. పిల్లలను ఉన్నత చదువులు చదివించాలన్నారు. కుల వృత్తులు మరుగున పడకుండా వాటికి జీవం పోయాలన్నారు. కులవృత్తులపై ఆధారపడి జీవిస్తున్నవారిని ప్రభుత్వం గుర్తించి వారిని అన్ని విధాలుగా ఆదుకుంటున్నట్లు మంత్రి వివరించారు.
కుమ్మరుల సమస్యల పరిష్కారానికి కృషి
మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు మంచి చెడుల కార్యక్రమాలకు కుండ అవసరమవుతుందని మంత్రి పేర్కొన్నారు. గ్రామ దేవతలను పూజిస్తున్న కుమ్మరులు ఆలయాల్లో కూడా ప్రాధాన్యత, ప్రావీణ్యం కోసం కృషి చేయాలని కోరారు. సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి కుమ్మరుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. 15 రోజుల్లో కుమ్మరుల భవనానికి స్థలం కేటాయిస్తానని హమీ ఇచ్చారు. హక్కులను మర్చిపోవద్దని.. ప్రభుత్వం మీ వెంట ఉందని స్పష్టం చేశారు. రాష్ట్రం ఏర్పడక ముందు 12 గురుకులాలుంటే రాష్ట్రం ఏర్పడిన అనంతరం 312 గురుకులాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. విద్యార్థులు విదేశాలకు వెళ్లడానికి ప్రభుత్వం రూ.20లక్షలు ఇస్తున్నదని, విదేశాలకు వెళ్లిన వారిలో 1000 మంది బీసీ విద్యార్థులున్నారన్నారు.
కులవృత్తులకు జీవం పోయాలని మంత్రి కోరారు.
కార్యక్రమంలో కుమ్మరుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జయంత్, జడ్పీటీసీ జంగారెడ్డి, ఎంపీపీ జ్యోతి, మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ చంద్రశేఖర్, సర్పంచ్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు లక్ష్మీనర్సింహరెడ్డి, అధ్యక్షుడు జయేందర్ ముదిరాజ్, వర్కింగ్ ప్రెసిడెంట్ మేఘనాథ్రెడ్డి, ఉపాధ్యక్షుడు మహేందర్రెడ్డి, మహిళా అధ్యక్షురాలు ఇందిరమ్మ, డైరెక్టర్ ఆనంద్, మాజీ డైరెక్టర్ ప్రకాశ్రెడ్డి, సోషల్ మీడియా కన్వీనర్ దీక్షిత్రెడ్డి ఉన్నారు. అంతకు ముందు నేదునూరులో జరిగిన చర్చి వార్షికోత్సవంలో సర్పంచ్ రామకృష్ణారెడ్డి, రైతు విభాగం అధ్యక్షుడు అమరేందర్రెడ్డితో కలిసి మంత్రి పాల్గొన్నారు.