తెలంగాణ ప్రభుత్వం రాఖీ పండుగకు ఒక రోజు ముందే ఆడబిడ్డలకు డబుల్ బెడ్ రూం ఇండ్లను కానుకగా ఇచ్చింది. బుధవారం రంగారెడ్డి కలెక్టరేట్లో విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి సమక్షంలో ర్యాండమైజేషన్ పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలోని మహేశ్వరం, రాజేంద్రనగర్, ఎల్బీనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల పరిధిలోని లబ్ధిదారులకు రెండు వేల ఇండ్లను కేటాయించారు. సొంతింటి కల నెరవేరనుండడంతో ఎంపికైన లబ్ధిదారుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఈ సందర్భంగా మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ పేదలకు ఉచితంగా ఇండ్లు కట్టించి ఆత్మగౌరవంతో గొప్పగా జీవించేలా చేయాలన్న సంకల్పంతోనే ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తున్నదన్నారు. తొలి విడుతలో 2వేల మందికి ఇండ్లను కేటాయించామని, మిగిలిన వారికి విడుతల వారీగా కేటాయిస్తామన్నారు. లబ్ధ్దిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఎన్ఐసీ సంస్థ ప్రత్యేకంగా రూపొందించిన ర్యాండమైజేషన్ సాఫ్ట్వేర్ ద్వారా ఆన్లైన్ డ్రా నిర్వహించినట్లు తెలిపారు.
– రంగారెడ్డి, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ)
రంగారెడ్డి, ఆగస్టు 30(నమస్తే తెలంగాణ): రాఖీ పండుగ వేళ.. ఆడపడుచులకు ప్రభు త్వం కానుకను అందించింది. డబుల్ బెడ్ రూం ఇండ్లను మంజూరు చేసి సొం తింటి కలను నిజం చేసింది. రెండు పడకల ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను బుధవారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి సమక్షంలో నిర్వహించారు. ర్యాండమైజేషన్ పద్ధతిలో జిల్లాలోని జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న మహేశ్వరం, రాజేంద్రనగర్, ఎల్బీనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల పరిధిలోని లబ్ధిదారులను ఎంపిక చేసి రెండు వేల ఇండ్లను కేటాయించారు. రెక్కాడితే గానీ డొక్కాడని బీద లు, సొంతగూడుకు నోచని వారు సర్కా రు కరుణతో ఓ ఇంటి వారయ్యారు. వీరంతా త్వరలోనే గృహప్రవేశాలు చేసి పాలు పొంగించి పండుగ చేసుకోనున్నారు.
జిల్లాలోని ఆరు నియోజకవర్గాల పరిధిలో 29 చోట్ల రూ. 2,104.06 కోట్లతో 23,600 డబుల్ బెడ్ రూం ఇండ్లను ప్రభుత్వం నిర్మిస్తున్నది. వీటిలో 11,004 ఇండ్ల నిర్మాణాలు పూర్తై ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. మొదటి విడుతలో నాలుగు నియోజకవర్గాల్లో ఇండ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో రూ. 883.81 కోట్లతో.. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో రూ.63.23 కోట్ల తో, ఎల్బీనగర్ నియోజకవర్గం లో రూ.86.26కోట్లతో, శేరిలింగంపల్లి నియోజకవర్గంలో రూ.30.32 కోట్లతో ఇండ్లను ప్రభుత్వం నిర్మించిం ది. పూర్తైన ఇండ్లను విడుతల వారీగా లబ్ధిదారులకు కేటాయిస్తున్నది. ఇందులో భాగంగా బుధవారం కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో లబ్ధిదారులను ఎంపిక చేశారు. రాజేంద్రనగ ర్ నియోజకవర్గం నుంచి 4,166 దరఖాస్తులు రాగా.. ఎల్బీనగర్ నుంచి 4,752, మహేశ్వరం నుంచి 651, శేరిలింగంపల్లి నుంచి 2,910 కలిపి మొత్తం 12,479 దరఖాస్తులు రాగా వీటిలో నుంచి ప్రతి నియోజకవర్గం నుంచి 500 చొప్పున రెండు వేల మంది లబ్ధిదారులను ఎంపిక చేశా రు. ఆయా నియోకవర్గాల ఎమ్మెల్యేల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ అనితాహరినాథ్రెడ్డి, ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశం, ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీ, ఎమ్మెల్యేలు అంజయ్యయాదవ్, ప్రకాశ్ గౌడ్, కలెక్టర్ హరీశ్, అదనపు కలెక్టర్లు ప్రతిమా సింగ్, భూపాల్రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ మానస పుత్రికలో డబుల్ బెడ్ రూం ఇండ్ల పథకం ఒకటి. పేదల సొంతింటి కలన నెరవేర్చి వారు ఆత్మగౌరవంతో గొప్పగా జీవించేలా చేయాలన్న సంకల్పంతోనే ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తున్నది. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్తు, తాగునీరు వంటి పలు వసతులను కల్పిం చి లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నది. లబ్ధ్దిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఎన్ఐసీ సంస్థ ప్రత్యేకంగా రూపొందించిన ర్యాండమైజేషన్ సాఫ్ట్వేర్ ద్వా రా ఆన్లైన్ డ్రా తీసి తొలి విడుత లో రెండు వేల మందికి ఇం డ్లను కేటాయించడం జరిగింది. మిగిలిన వారికి కూ డా విడుతల వారీగా కేటాయిస్తాం. ఇండ్లు పొందిన లబ్ధిదారులకు శుభాకాంక్షలు. -సబితా ఇంద్రారెడ్డి, రాష్ట్ర విద్యా శాఖ మంత్రి