ఆమనగల్లు, ఏప్రిల్ 15: వచ్చే విద్యాసంవత్సరం నుంచి రాష్ట్రంలోని 26 వేల ప్రభుత్వ బడుల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధనను అందించేందుకు ప్రణాళికలు రూపొందించడంతోపాటు రూ. ఏడు వేల కోట్ల తో మౌలిక వసతులను కల్పించనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం ఆమె కడ్తాల మండలంలోని రావిచేడ్ గ్రామంలో మన ఊరు-మనబడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టా రు. అనంతరం రావిచేడ్, న్యామతాపూర్ గ్రామాల్లో రైతువేదిక భవనాలు, వైకుంఠధామాలు, సీసీరోడ్లు, డంపింగ్ యార్డులను ఎమ్మెల్యే జైపాల్యాదవ్, జడ్పీచైర్పర్సన్ అనితారెడ్డితో కలిసి ఆమె ప్రారంభించారు. అనంతరం రావిచేడ్ గ్రామంలో ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయాలను సీఎం కేసీఆర్ ఆచరణలో పెడుతున్నారని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు నాణ్యమైన విద్యను అందించేందుకే గురుకులాలను ఏర్పాటు చేశారన్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని ఐదు వేలమంది విద్యార్థులను విదేశాలకు పైచదువుల కోసం పంపించినట్లు చెప్పారు.
దళితబంధులాంటి పథకం ప్రపంచంలో ఎక్కడాలేదని, దీని ద్వారా నేరుగా లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాలో రూ.పది లక్షలను ప్రభుత్వం జమ చేస్తున్నట్లు తెలిపా రు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనాలని కేంద్రా న్ని కోరితే పట్టించుకోలేదన్నారు. రైతులు ఆగం కావొద్దనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ ఈ యాసంగిలోనూ వడ్లను కొంటామని ప్రకటించినట్లు తెలిపారు. త్వరలోనే వివి ధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు నోటిఫికేషన్లను ప్రభుత్వం విడుదల చేస్తుందని, నిరుద్యోగ యువతీయువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బండి సంజయ్ బీజేపీ అధికారంలోకి వస్తే ఉచిత విద్య, వైద్యం అందిస్తామని కల్లబొల్లి మాటలు చెబుతున్నారని ఆమె మండిపడ్డారు. రాష్ర్టానికి నవోదయ, మెడికల్, ఐఐటీ, ఐఐఐటీలను మంజూరు చేయడంలో కేంద్ర ప్రభుత్వం మొండిచేయ్యి చూపిందని తెలిపారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని రాష్ర్టాన్ని ఎవరూ అభివృద్ధి చేస్తున్నారో.. ఎవరూ ఆగం చేస్తున్నారో వారికి తగిన గుణపాఠం చెబుతారన్నారు. అంతకుముందు న్యామతాపూర్, రావిచేడ్ గ్రామాల్లో మంత్రికి ప్రజలు ఘన స్వాగతం పలికారు.
తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధిపథంలో ముందుకు దూసుకెళ్తుంటే ఓర్వలేని కేంద్ర ప్రభుత్వం అభివృద్ధికి ఆటంకాలను సృష్టిస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ తీవ్రంగా మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్ పార్లమెంటరీ వ్యాఖ్య లు చేస్తున్నారని రాబోయే రోజుల్లో ఆయనకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం పూటకో మాట చెప్పి రైతులను ఇబ్బందులకు గురి చేసిందన్నారు. వడ్లు కొనబోమని కేంద్రం చెప్పడంతో రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని సీఎం కేసీఆర్ వడ్ల కొనుగోలుకు గ్రీన్ సిగ్న ల్ ఇచ్చినట్లు కొనియాడారు. ప్రభుత్వ పాలన, సీఎం కేసీఆర్పై విమర్శలు చేసే వారికి తగిన బుద్ధి చెప్పాలని ఆయన టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నియోజకవర్గంలోని అర్హులందరికీ దళితబంధు పథకం అందుతుందన్నారు. అనంతరం జడ్పీచైర్పర్సన్ అనితారెడ్డి మాట్లాడుతూ పల్లెప్రగతి కార్యక్రమం ద్వారా పల్లెల రూపురేఖలు పూర్తిగా మారిపోయినట్లు తెలిపారు.
జిల్లాలోని అన్ని పంచాయతీలకు మౌలిక వసతుల కల్పనకు నిధులను కేటా యిస్తానన్నారు. దళితబంధు పథకం గొప్పదని అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. సమావేశం అనంతరం పలువురు మంత్రికి వివిధ సమస్యలపై వినతి పత్రాలను అందజేశారు. ఆయా కార్యక్ర మాల్లో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు శ్రీనివాస్రెడ్డి, జడ్పీటీసీ దశరథ్నాయక్, ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, వైస్చైర్మన్ తోట గిరియాదవ్, సింగిల్విండో చైర్మన్ వెంకటేశ్, వీరయ్య, సర్పంచులు లక్ష్మీదేవీభారతమ్మ, రవీందర్రెడ్డి, లక్ష్మీనరసింహారెడ్డి, సులోచనాసాయిలు, ఎంపీటీసీలు గోపాల్, లచ్చీరాంనాయక్, మండల పార్టీ అధ్యక్షులు అర్జున్రావు, శంకర్, ఉపసర్పంచ్ వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.