ఆకస్మిక గుండెపోటుకు గురైన వ్యక్తులకు సకాలంలో సీపీఆర్ (కార్డియో పల్మోనరీ రిససిటేషన్) చేసి ప్రాణముప్పును తప్పించవచ్చునని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. వైద్య ఆరోగ్య, పోలీస్ శాఖల ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన శిక్షణా కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించి ప్రసంగించారు. సీపీఆర్ విధానంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలన్నారు.
రంగారెడ్డి, మార్చి 24 (నమస్తే తెలంగాణ): ఆకస్మిక గుండెపోట్లకు సీపీఆర్ (కార్డియో పల్మనరీ రిససిటేషన్) చికిత్స విధానం చెక్ పెడుతుందని.. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా తరచుగా చోటు చేసుకుంటున్న కార్డియాక్ అరెస్ట్ను నియంత్రించేందుకు సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రభుత్వం ప్రజలకు ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇం ద్రారెడ్డి అన్నారు. సీపీఆర్, ఇంకా ఆటోమేటిక్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్ (ఏఈడీ) శిక్షణా కార్యక్రమాన్ని ఇటీవల ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించిందని.. అయితే, కార్డియాక్ హెల్త్ కేర్ వ్యవస్థను పటిష్టం చేసేందుకు రంగారెడ్డి జిల్లాలోనూ ఈ తరహా శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు మంత్రి సబితారెడ్డి తెలిపారు. జిల్లాలో వైద్యారోగ్య, పోలీస్ శాఖల ఆధ్వర్యంలో కొంగర కలాన్లోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం సీపీఆర్ అండ్ ఏఈడీ శిక్షణా కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించి.. జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులు, వైద్యారోగ్య శాఖ అధికారులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జీవనశైలి, ఆహారపు అలవాట్లు మారడంతో ప్రపంచవ్యాప్తంగా ఆకస్మిక గుండెపోట్లు పెరిగాయన్నా రు. గుండెపోటుకు గురైన వారికి వెంటనే సీపీఆర్ చేస్తే ప్రాణాపాయం తప్పే అవకాశాలున్నాయన్నారు. సీఎం కేసీఆర్ రైతు బాంధవుడే కా కుండా ప్రజలకు మెరుగైన వైద్య చికిత్సలు అం దుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో సీపీఆర్ అండ్ ఏఈడీ చికిత్సా విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా తీసుకొచ్చారన్నారు. ప్రజా శ్రేయస్సును కాంక్షించడం మన ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యమన్నారు. ఓ వ్యక్తికి ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్ అయినప్పుడు అంబులెన్స్ వచ్చే లోపు, వైద్యుడి చెం తకు చేరే లోపు సీపీఆర్ చేస్తూ ఊపిరి అందిస్తే ఒక నిండు జీవితాన్ని, కుటుంబాన్ని కాపాడిన వారిమి అవుతామన్నారు. శిక్షణ పొందిన, నైపు ణ్యం కలిగిన ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్(ఈఎంఎస్) సిబ్బంది సేవలు దవాఖానల్లో చేరక ముందు అందుబాటులో ఉంచడమనేది సమాజానికి దొరికే మొదటి సహాయమని అన్నారు. గుండెపోటుకు గురైన వారికి వెంటనే సీపీఆర్ చేస్తే ప్రాణాపాయం తప్పే అవకాశాలుంటాయ ని.. అందువల్ల ప్రతి ఒక్కరూ సీపీఆర్పై అవగాహన పెంచుకోవాలని సూచించారు.
ఈ విధానంపై గ్రామాల నుంచి పట్టణాల దాకా అందరిలోనూ అవగాహన పెరగాలన్నారు. ప్రధానంగా అంగన్వాడీ సిబ్బందికి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ సభ్యులకు ముందస్తుగా అవగాహన కల్పించాలన్నారు. వీరి ద్వారా గ్రామీణ వాతావరణంలోని అందరికీ దీనిపై అవగాహన పెరిగే అవకాశాలుం టాయన్నారు. పల్లె, బస్తీ దవాఖానల్లోనూ సీపీఆర్పై అవగాహన అవసరమన్నారు. శిక్షణ పొం దిన ట్రైనర్లతో శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, తిరిగి వారు ఇతరులకు శిక్షణ ఇస్తారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రజలకు కంటి వెలుగు కార్యక్రమం ద్వారా ఉచితం గా కంటి పరీక్షలు నిర్వహించి అద్దాలతోపాటు మందులను పంపిణీ చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. అనంతరం ప్రపంచ క్షయ వ్యాధి నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని పోస్టర్ను ఆవిష్కరించారు. కొందరు మహిళలకు ఎన్సీడీ కిట్లు అందజేశారు. కార్యక్రమానికి ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్రెడ్డి, జైపాల్యాదవ్, ఎమ్మెల్సీలు ఎగ్గే మల్లేశం, దయానంద్, అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి వెంకటేశ్వరరా వు, మున్సిపల్ కమిషనర్లు, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధు లు, వైద్యారోగ్య సిబ్బం ది పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ గొప్ప ఆలోచనతోనే..
ఇటీవల దేశంలో తరచుగా ఆకస్మిక గుండెపోట్లు చోటు చేసుకొని పలువురు మృత్యువాత పడుతుండటాన్ని గమనించిన సీఎం కేసీఆర్ ప్రజలకు నాణ్యతతో కూడిన వైద్యం అందాలని, వారు ఆరోగ్యవంతులుగా ఉండాలనే గొప్ప ఆలోచనతో రాష్ట్రంలో సీపీఆర్ అండ్ ఏఈడీ శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు. సడెన్ కార్డియాక్ అరెస్ట్ అయితే బాధిత వ్యక్తి గుండె పనులు ఆకస్మికంగా తగ్గిపోవడం, శ్వాస ఆగిపోయి, స్పృహ కోల్పోతాడు. తక్షణం సీపీఆర్ చేయకపోతే వ్యక్తి మరణించే అవకాశం ఉంటుంది. అత్యవసర నిర్వహణలో సీపీఆర్, ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డీఫిబ్రిలేటర్ (ఏఈడీ) ఉంటాయి.
– డాక్టర్ అనితాహరినాథ్రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ రంగారెడ్డి
వయసుతో నిమిత్తం లేకుండా గుండెపోటు
ఇటీవల వయసుతో నిమిత్తం లేకుండా చాలామంది యువకులు గుండెపోటుతో చనిపోతున్నారు. ఆకస్మిక గుండెపోట్లకు సీపీఆర్ చికిత్సా విధానంతో అరికట్టొచ్చు. సీపీఆర్పై ప్రజల్లో చాలామందికి అవగాహన వచ్చినా… ఎలా చేయాలో తెలియడంలేదు. ఆకస్మికంగా కుప్పకూలిన వ్యక్తిని పలకరించి, నాడి, ఊపిరి తీసుకుంటున్నారో లేదో ముందుగా పరిశీలించాలి.. గుండెపోటు అని నిర్ధారణకు వచ్చిన వెంటనే 108 అంబులెన్స్కు ఫోన్ చేస్తూ ఒక్క నిమిషంలో 100 నుంచి 120 సార్లు గుండెపై రెండు చేతులతో పుష్అప్ చేస్తూ మధ్య మధ్యన ఊపిరి అందిస్తుండాలి. అనంతరం ఏఈడీ యంత్రం ద్వారా షాక్ ఇప్పించాలి. – హరీశ్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్