మరోసారి గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ దూసుకెళ్తున్నది. అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, పూర్తయిన పనుల ప్రారంభోత్సవాలతో ఎమ్మెల్యే అభ్యర్థులు నిత్యం ప్రజల మధ్యనే ఉంటున్నారు. మంత్రి సబితారెడ్డితోపాటు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు వరుసబెట్టి ఉమ్మడి జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రగతి నివేదన సభలు నిర్వహిస్తూ పదేండ్లుగా బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూనే.. కాంగ్రెస్, బీజేపీల అసలు స్వరూపాన్ని బట్టబయలు చేస్తున్నారు. అంతేకాకుండా ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్లోకి వలసలు ఊపందుకున్నాయి. సీఎం కేసీఆర్ పాలనకు ఆకర్షితులై ఇతర పార్టీల ముఖ్య నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరుతున్నారు. ఒక పక్క ఊరూరా అభివృద్ధి, సంక్షేమ జాతర, మరోవైపు భారీ చేరికలతో బీఆర్ఎస్ తిరుగులేని శక్తిగా అవతరిస్తున్నది. ఇవన్నీ బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో నయా జోష్ నింపుతుండగా.. బీజేపీ, కాంగ్రెస్ నేతల్లో మాత్రం గుబులు పుట్టిస్తున్నాయి.
-రంగారెడ్డి, అక్టోబర్ 7(నమస్తే తెలంగాణ)
చేవెళ్ల నియోజకవర్గంలోని చందన్వెల్లి, సీతారాంపూర్లలో రూ.1,550కోట్లతో ఏర్పాటు చేస్తున్న రెండు కంపెనీలకు ఇటీవల శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్, షాద్నగర్ నియోజకవర్గంలో రూ.270కోట్లతో చేపట్టనున్న పనులకూ ప్రారంభోత్సవాలు చేశారు. లబ్ధిదారులకు డబుల్బెడ్రూం ఇండ్లు పంపిణీ చేశారు. మంత్రులు హరీశ్రావు, సబితారెడ్డి కందుకూరులో మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేయడంతోపాటు రావిర్యాల ఉన్నత పాఠశాలలో సీఎం అల్పాహార పథకానికి శ్రీకారం చుట్టారు. ఇవేకాకుండా నిత్యం ఏదో ఒక చోట్ల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజల అభిమానాన్ని చూరగొంటున్నారు.
రంగారెడ్డి, అక్టోబర్ 7(నమస్తే తెలంగాణ) : ‘రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ అన్ని అసెంబ్లీ స్థానాల్లో గులాబీ జెండాను ఎగుర వేసేందుకు సిద్ధమవుతున్నది. ఇప్పటికే పూర్తయిన పనులకు ప్రారంభోత్సవాలు, కొత్తగా చేపట్టే పనులకు శం కుస్థాపనలు చేస్తూ ఎమ్మెల్యే అభ్యర్థులు క్షేత్రస్థాయిలో బిజీబిజీగా కనిపిస్తున్నారు. జిల్లా మంత్రి సబితాఇంద్రారెడ్డితోపాటు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు వరుసబెట్టి జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. పదేండ్లలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని వివరిస్తూనే.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అసలు స్వరూపాన్ని ప్రజల సమక్షంలోనే ఎండగడుతున్నారు. మరోపక్క ఇతర పార్టీల నుంచి భారీగా బీఆర్ఎస్లోకి వలసలు ఊపందుకున్నాయి. ఇవన్నీ.. బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో నయా జోష్ను నింపుతున్నాయి.’
పర్యటనల సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులకు ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు. అలాగే నేతలు చేస్తు న్న ప్రసంగాలకు జై కొడుతూ మద్దతు పలుకుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న ఆత్మీయ స మ్మేళనాలు, భారీ బహిరంగ సభలకు సైతం పెద్ద ఎత్తున అన్నివర్గాల ప్రజలు తరలివచ్చి నేతల ప్ర సంగాలను ఆసక్తిగా వింటున్నారు. బీజేపీ, కాంగ్రె స్ పార్టీలను లక్ష్యంగా చేసుకుని చేస్తున్న ప్రసంగాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్, బీజేపీలు చేస్తున్న తప్పు డు ప్రచారాన్ని నేతలు వ్యూహాత్మకంగా తిప్పికొడుతున్నారు. గత పదేండ్లుగా తాము చేసిన అభివృద్ధి పనులు నిజమైతేనే బీఆర్ఎస్కు ఓటెయ్యాలని బహిరంగంగా సవాల్ విసురుతుండడం ప్ర జలను మరింతగా ఆకర్షిస్తున్నది. అభివృద్ధి, సంక్షే మం గురించి వివరిస్తూ ఓ వైపు పార్టీ శ్రేణులను ఉత్తేజ పరుస్తూనే.. బీజేపీ, కాంగ్రెస్పై ఎదురుదా డి కొనసాగించి రెండు పార్టీల బండారాన్ని ప్రజ ల సమక్షంలో బట్టబయలు చేస్తున్నారు. జిల్లాలో తాజా రాజకీయ పరిస్థితులు కాంగ్రెస్, బీజేపీల ను డైలమాలో పడేస్తున్నాయి.
జిల్లాలో బీఆర్ఎస్ పార్టీలోకి ఇతర పార్టీల నుంచి వలసలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ ప్రభు త్వం అమలు చేస్తున్న అభివృద్ధితోపాటు గడపగడపకూ చేరుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీఆర్ఎస్వైపు ఆకర్షితులవుతున్నారు. పార్టీ విధానంపై బీఆర్ఎస్ పార్టీలో ఉన్న స్పష్టత మరే పార్టీలో లేకపోవడంతో కాంగ్రెస్, బీజేపీల నుంచి వలసలు ఎక్కువగా ఉంటున్నాయి. చేరుతున్న వారిలో ఆయా పార్టీలకు చెందిన ముఖ్య నేతలతోపాటు క్రియాశీలక కార్యకర్తలు ఉంటున్నారు. కొన్నిచోట్ల ఇతర పార్టీలకు స్థానం లేకుండా ఊ రంతా బీఆర్ఎస్వైపే వస్తున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. ప్రతి నిత్యం మంత్రి సబితా ఇంద్రారెడ్డితోపాటు, ఎమ్మెల్యేల సమక్షంలో నిత్యం భారీ గా చేరికలు ఉంటున్నాయి. ఇవన్నీ బీఆర్ఎస్ పా ర్టీ ఎమ్మెల్యేలకు కొండంత బలాన్నిస్తున్నాయి.
బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లాలో కంటిన్యూగా కార్యక్రమాలను చేపడుతున్నది. జిల్లా మంత్రి సబితాఇంద్రారెడ్డితోపాటు, ఎమ్మెల్యేలంతా కా ర్యకర్తలతో కలిసి పర్యటిస్తున్నారు. ప్రజలతో మమేకమై ప్రభుత్వం చేసిన అభివృద్ధితోపాటు, చేపట్టబోయే కార్యక్రమాలను వివరిస్తున్నారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు వరుసబె ట్టి జిల్లాలో పర్యటించి పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్తేజాన్ని నింపుతున్నారు. ఈ నెలలోనే మంత్రి హరీశ్రావు జిల్లాలో రెండుసార్లు పర్యటించారు. ఈనెల 1న మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి ప ర్యటించి మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేశారు. జల్పల్లిలో కుల సంఘాల ఆత్మీయ సమ్మేళనంలో నూ పాల్గొన్నారు. ఈ నెల 6న మహేశ్వరం నియోజకవర్గంలోని రావిర్యాల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సీఎం అల్పాహారం పథకం ప్రారంభోత్సవంలోనూ పాల్గొన్నారు.
ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గత సెప్టెంబర్ 27న చేవెళ్ల నియోజకవర్గంలో పర్యటించి చందన్వెళ్లి, సీతారాంపూర్లో రూ.1,550కోట్ల తో ఏర్పాటు చేస్తున్న రెండు కంపెనీలకు శంకుస్థాపన చేశారు. అక్టోబర్ 5న షాద్నగర్ నియోజకవర్గంలో రూ.270 కోట్ల పనులకు ప్రారంభోత్సవాలు చేసి ప్రగతి నివేదన సభలోనూ పాల్గొన్నారు. జిల్లాలో రూ.2,014కోట్ల వ్యయంతో 23,600 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలను ప్రభుత్వం చేపడుతుండగా ఇప్పటివరకు మంఖాల్, మన్సాన్పల్లి, పెద్ద అంబర్పేట్, అబ్దుల్లాపూర్మెట్, షాద్నగర్ తదితర ప్రాం తాల్లో నిరుపేదలకు ప్రభుత్వం అందజేసింది. మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, మహమూ ద్ అలీ, పట్నం మహేందర్ రెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఇండ్ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. ఇలా నిత్యం ఏదో ఒక ప్రాంతం లో కార్యక్రమాలను నిర్వహిస్తూ బీఆర్ఎస్ పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీ లు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్పర్సన్తోపాటు ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు ప్రజల మధ్యలోనే ఉంటున్నారు.