రంగారెడ్డి, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా కందుకూరులో ఏర్పాటు చేయనున్న మెడికల్ కాలేజీకి ప్రభుత్వం శనివారం పరిపాలన అనుమతులను మంజూరు చేసింది. రూ.176కోట్లతో కళాశాల ఏర్పాటుకు సంబంధించి ఉత్తర్వులను జారీ చేసింది. కొత్తగా ఏ ర్పాటు చేస్తున్న ఈ కాలేజీ నిర్మాణానికి సంబంధించి ఆరోగ్య శాఖ, ఆర్అండ్బీ అధికారులు అధ్యయనం చేసి ప్రతిపాదనలు రూపొందించ గా ప్రభుత్వం అనుమతులను ఇచ్చింది.
ఈ ని ధులతో ఎన్ఎంసీ నిబంధనలకు అనుగుణంగా కాలేజీలు, ల్యాబ్లు, సెమినార్ హాల్స్, అనుబంధ ఆస్పత్రి భవనాలు, హాస్టల్ భవనాల ని ర్మాణం, ఇతర వసతులను కల్పించనున్నారు. వచ్చే ఏడాది నాటికి మెడికల్ కాలేజీని అందుబాటులోకి తేనున్నారు. మెడికల్ కాలేజీ నిర్మాణానికి నిధులు కేటాయించినందుకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ప్రజలకు వైద్యంతోపాటు వైద్యావిద్య కష్టాలను దూరం చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో తెలంగాణ రాష్ట్రం మెడికల్ హబ్గా అవతరించిందన్నారు.