బొంరాస్పేట, నవంబర్ 25 : రాష్ట్రంలో బీఆర్ఎస్ గాలి వీస్తున్నదని మూడోసారి గెలిచి సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ కొడుతారని రాష్ట్ర గనులు, భూ గర్భ వనరుల శాఖల మంత్రి పట్నం మహేందర్రెడ్డి అన్నారు. శనివారం దుద్యాల మండలం పో లేపల్లి తండాకు చెందిన 50 మంది గిరిజనులు పట్నం మహేందర్రెడ్డి సోదరి నర్మదారెడ్డి ఆధ్వర్యంలో మంత్రి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లో చేరారు.
అలాగే కొడంగల్ మండ లంలోని ఉడిమేశ్వరంలో 100 మంది ఇతర పార్టీల నాయకులు బీఆర్ఎస్లో చేరారు. వీరికి మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆ హ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ దెబ్బకు కొడంగల్లో కాంగ్రె స్ ఖాళీ అవుతున్నదని, నరేందర్రెడ్డి గెలుపు ఖాయమన్నారు.
బీఆర్ఎస్లో చేరిన వారిలో రూప్లానాయక్, లక్ష్మణ్ నాయక్, హనుమాన్ నా యక్, రాంసింగ్, రఘునాయక్, రవి, తులసి యా, శంకర్, రాహుల్, నెహ్రూ, హరి, సేవ్యా, కృష్ణ, వెంకట్, శ్రీను, వినోద్, హన్మంతు, మోహ న్, నరేశ్లు ఉన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ చౌహాన్ అరుణాదేశు, బీఆర్ఎస్ దుద్యాల మం డల అధ్యక్షుడు చాంద్పాషా, పీఏసీఎస్ చైర్మన్ విష్ణువర్ధన్రెడ్డి, పోలేపల్లి సర్పంచ్ రామకృష్ణారెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు దేశ్యానాయక్ తదితరులు పాల్గొన్నారు.