దేశ మంతా షాబాద్ వైపు చూసేలా పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందుతున్నదని, వేలాది మందికి ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయని రాష్ట్ర గనులు,భూగర్భవనరులు, సమాచార, పౌరసంబంధాల శాఖల మంత్రి డాక్టర్ పట్నం మహేందర్రెడ్డి అన్నారు. మంగళవారం షాబాద్ మండలంలోని కొమరబండ గ్రామంలో రూ.5కోట్ల నిధులతో చేపట్టిన వాగుపై బ్రిడ్జి నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం జడ్పీటీసీ అవినాశ్రెడ్డి నేతృత్వంలో బీఆర్ఎస్ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించి మంత్రికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నదన్నారు. చేవెళ్లలో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ సభలో కాంగ్రెస్ నాయకుల కల్లబొల్లి మాటలను ప్రజలు నమ్మరన్నారు. తెలంగాణలోఅమలవుతున్న రైతుబంధు, రైతుబీమా, దళితబంధు, రుణమాఫీ, కల్యాణలక్ష్మి వంటి పథకాలు కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలవుతున్నాయా.. అని ప్రశ్నించారు. రాబోవు ఎన్నికల్లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో స్థానిక ఎమ్మెల్యే యాదయ్య, ఎంపీ రంజిత్రెడ్డిలను భారీ మెజార్టీతో గెలిపించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. రాబోవు సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
– షాబాద్, ఆగస్టు 29
షాబాద్, ఆగస్టు 29 : పరిశ్రమల ఏర్పాటుతో దేశ చిత్రపటంలో నిలిచేలా షాబాద్ ప్రాంతం అభివృద్ధి చెందుతున్నదని.. దేశం చూపు షాబాద్ వైపు మళ్లిందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, సమాచార, పౌరసంబంధా ల శాఖల మంత్రి డాక్టర్ పట్నం మహేందర్రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని కొమరబండ గ్రామంలో రూ.5కోట్లతో వాగుపై నిర్మించనున్న బ్రిడ్జి పనులకు రంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ముందుగా జడ్పీటీసీ అవినాశ్రెడ్డి నేతృత్వం లో బీఆర్ఎస్ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించి మంత్రికి ఘనస్వాగతం పలికారు. అనంతరం పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మహేందర్రెడ్డి మాట్లాడుతూ దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా తెలంగాణ రాష్ట్రం ప్రగతిపథంలో ముందుకు సాగుతుందన్నారు. రంగారెడ్డి జిల్లా ఊహించలేని విధంగా అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్తున్నదన్నారు. జిల్లాకు పంచాయతీరాజ్ నిధులు రూ. 124 కోట్లు ఇస్తే, అందులో చేవెళ్ల నియోజకవర్గానికే రూ.54కోట్లు కేటాయించినట్లు తెలిపారు. నియోజకవర్గాభివృద్ధికి ఎమ్మెల్యే కాలె యాద య్య ఎంతో కృషి చేస్తున్నారన్నారు. ఐటీ మంత్రి కేటీఆర్ సహకారంతో షాబాద్లో దేశ, విదేశీ కంపెనీలు ఏర్పాటై వేలాది మందికి ఉపాధి, ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయన్నారు.సీతారాంపూర్లో ఎలక్ట్రికల్ వాహనాల తయా రీ కంపెనీ నిర్మాణం పూర్తైతే షాబాద్, చేవెళ్ల, శంకర్పల్లి, మొయినాబాద్, షాద్నగర్, శంషాబాద్ తదితర ప్రాం తాల ప్రజలకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయన్నారు.
తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు పక్కనున్న కర్ణాటక రాష్ట్రంలో అమలు కావడంలేదన్నారు. చేవెళ్లలో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ సభలో కాంగ్రెస్ నాయకులు ఏవేవో చెప్పి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ధరణి పోర్టల్ను తీసుకొచ్చి ప్రజల భూముల సమస్యలను పరిష్కరిస్తుంటే ప్రతిపక్షాలు ఓర్వలేక ధరణిపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో స్థానిక ఎమ్మెల్యే యాదయ్య, ఎంపీ రంజిత్రెడ్డిలను మరోసారి భారీ మెజార్టీతో గెలిపించాలని పార్టీ శ్రేణులు, ప్రజలకు సూచించారు. జిల్లాలోనే మారుమూల గ్రామం గొల్లూరుగూడ నుంచి రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన తనకు రెండోసారి రాష్ట్ర క్యాబినెట్లో మంత్రిగా అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్కు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పల్లెపల్లెకూ అవినాశ్రెడ్డి కార్యక్రమం ద్వారా జడ్పీటీసీ అవినాశ్రెడ్డి గ్రామాల్లో పర్యటించి ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కరించడం గొప్ప పరిణామమని కొనియాడారు. కార్యక్రమంలో ఎంపీపీ కోట్ల ప్రశాంతిరెడ్డి, వైస్ ఎంపీపీ లక్ష్మి, సహకార సంఘం చైర్మన్ శేఖర్రెడ్డి, వైస్ చైర్మన్ మల్లేశ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నర్సింగ్రావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు మతిన్, శేరిగూడెం వెంకటయ్య, శ్రీనివాస్గౌడ్, కొమరబండ గ్రామ సర్పంచ్ చంద్రశేఖర్, మాజీ ఎంపీపీ వెంకటయ్య, మాజీ జడ్పీటీసీలు మహేందర్రెడ్డి, రాజేందర్గౌడ్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు మధుసూదన్రెడ్డి, ఎంపీడీవో అనురాధ, పీఆర్ డీఈఈ విజయ్కుమార్, ఏఈ శ్రీదివ్య, ఆయా గ్రామాల సర్పంచులు నర్సింహారెడ్డి, కుమ్మరి దర్శన్, కవిత, శ్రీనివాస్గౌడ్, కృష్ణగౌడ్, మల్లేశ్, మహేందర్రెడ్డి, అనిత, యాదమ్మ, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దేవేందర్రెడ్డి, సుధాకర్రెడ్డి, వెంకటయ్య, ఇమ్రాన్, మునీర్, ముఖ్రంఖాన్, శ్రీను, సాయిచరణ్గౌడ్, పార్టీ మండల నాయకు లు బల్వంత్రెడ్డి, వెంకట్రెడ్డి, రాంచంద్రారెడ్డి, గోపాల్, రాంచందర్, సురేశ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
మరో హైదరాబాద్లా షాబాద్ అభివృద్ధి ..
షాబాద్ ఒక మండలం కాదు.. హైదరాబాద్లాగా మారిపోతున్నది.. ప్రపంచం మొత్తం షాబాద్ గురించి మాట్లాడుతున్నది.. దేశ, విదేశాలకు చెందిన కంపెనీలు ఇక్కడ తమ శాఖలను ఏర్పా టు చేసేందుకు మొగ్గుచూపుతున్నాయి. వెల్స్పన్ కంపెనీని గుజరాజ్ నుంచి షాబాద్కు తీసుకొచ్చి ఈ ప్రాంత రూపురేఖలను మార్చిన ఘనత మంత్రి కేటీఆర్కే దక్కింది. రానున్న ఏ ఎన్నికల్లోనైనా గులాబీ కండువా తప్ప వేరే ఏ పార్టీ కండువా కనిపించదని ప్రజలు గట్టిగా మాట్లాడుతుంటే …బీఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాలను కాపీ కొడుతున్నదని భట్టి విక్రమార్క మా ట్లాడుతున్నారు. ఎక్కడి నుంచి ఏ సంక్షేమ పథకాన్ని కాపీ కొ ట్టామో చెప్పాలి.. లేదంటే మేము పెట్టిన పథకాలను మీరు ఎన్ని కాపీ కొట్టారో చెబుతాం. రానున్న అన్ని ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ పార్టీ ఘనవిజయం సాధించడం ఖాయం. రానున్న మూడు నెలలపాటు నాయకులు సైనికుల్లా పనిచేసి కాలె యాద య్యను భారీ మెజార్టీతో గెలిపించాలి. ఓట్ల కోసం ప్రజలను మభ్యపెట్టేందుకే ఇటీవల కాంగ్రెస్ పార్టీ చేవెళ్లలో జరిగిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్లో లేనిపోని హామీలను ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ నాయకులకు దమ్ము, ధైర్యం ఉంటే మీరు పరిపాలించే రాష్ర్టాల్లో ఇక్కడ ప్రకటించిన హామీలను అమలు చేసి చూపాలి. ప్రజలందరూ రానున్న ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ పార్టీని ఆదరించి మూడోసారి కూడా కేసీఆర్ను ముఖ్యమంత్రిని చేయాలి.
-డాక్టర్ గడ్డం రంజిత్రెడ్డి, చేవెళ్ల ఎంపీ
అన్ని వర్గాల సంక్షేమానికి కృషి
అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నది. జిల్లా పరిషత్తు నిధులతో గ్రామాల్లో సీసీ రోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీల నిర్మాణానికి కృషి చేస్తా. జడ్పీటీసీ అవినాశ్రెడ్డి ప్రభుత్వ నిధులతోపాటు, సొంత డబ్బులతో గ్రామాల్లో అభివృ ద్ధి, సేవా కార్యక్రమాలను చేపట్టడం ఎంతో బాగున్నది. ఉమ్మడి జిల్లాపై మంచి పట్టున్న మహేందర్రెడ్డికి మరోసారి సీఎం కేసీఆర్ మంత్రి పదవి ఇవ్వడం చాలా సంతోషకరం. మహిళల సంక్షేమానికి ఈ ప్రభుత్వం చాలా ప్రాధాన్యం ఇస్తున్నది. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. రానున్న ఎన్నికల్లో ప్రజలందరూ బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలిచి మూడోసారి కూడా కేసీఆర్ను ముఖ్యమంత్రిని చేయాలి.
-తీగల అనితారెడ్డి, రంగారెడ్డిజడ్పీ చైర్పర్సన్
తెలంగాణలో సీఎం కేసీఆర్ సారథ్యంలో సంక్షేమ పాలన సాగుతున్నది.
దేశం చూపు.. మన రాష్ట్రం వైపు ఉన్నది.. ఇంటింటికీ ప్రభు త్వ పథకాలు అందుతున్నాయి. సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చర్యలతో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ప్రజల ఇబ్బందులను గుర్తించిన సీఎం కేసీఆర్ ఈసీ, మూసీ వాగులపై పది బ్రిడ్జిల నిర్మాణానికి రూ.54 కోట్లు మంజూరు చేశారు. వీటితోపాటు చెక్డ్యాంల ఏర్పాటుతో రైతుల బోరుబావుల్లో నీటిమట్టం పెరిగేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తనకు మూడోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు . రానున్న ఎన్నికల్లో భారీమెజార్టీతో మరోసారి గెలిపిస్తే నియోజకవర్గాభివృద్ధికి కృషి చేస్తా. అర్హులకు ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తా. తన హయాంలో పెద్ద, పెద్ద కంపెనీలు ఏర్పాటై చేవెళ్ల నియోజకవర్గం రూపురేఖలు మారిపోవడం చాలా సంతోషంగా ఉన్నది.
– కాలె యాదయ్య , ఎమ్మెల్యే
దశలవారీగా హామీలను నెరవేర్చుతున్నా..
ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను దశల వారీగా నెరవేర్చుతున్నా. ఐదేండ్ల క్రితం ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు కొమరబండ వాగుపై బ్రిడ్జి నిర్మిస్తామని హామీ ఇచ్చా.. ఇందుకోసం ప్రభుత్వం నుంచి రూ. 5కోట్ల నిధులు మంజూరు చేయించి బ్రిడ్జి పనులను ప్రారంభించడం జరిగింది. తెలంగాణ రాకపోతే ఇలాంటి అభివృద్ధి పనులు జరిగేవి కావు. అదే విధంగా ఏట్ల ఎర్రవల్లి వాగుపై వంతెన నిర్మాణానికి రూ.3కోట్లు, మాచన్పల్లి-పోతుగల్ వాగుపై బ్రిడ్జి కోసం రూ.5కోట్లు నిధులు మంజూరయ్యాయి. రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎంపీలను భారీ మెజార్టీతో గెలిపించేందుకు పార్టీ శ్రేణులు సన్నద్ధం కావాలి.
-పట్నం అవినాశ్రెడ్డి, జడ్పీటీసీ