బొంరాస్పేట, నవంబర్ 21 : పేదల సంక్షేమం, గ్రామాల అభివృద్ధికి పాటుపడిన బీఆర్ఎస్ పార్టీకి త్వర లో జరుగనున్న ఎన్నికల్లో మరోసారి పట్టం కట్టాలని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలు, గనులు, భూగర్భ వనరుల శాఖల మంత్రి పట్నం మహేందర్రెడ్డి ప్రజలకు పిలుపినిచ్చారు. మంగళవారం దుద్యాల మండలంలోని హకీంపేట, పోలేపల్లి గ్రామాల్లో మంత్రి ము మ్మరంగా ప్రచారాన్ని నిర్వహించారు. మహిళలు, బీఆర్ఎస్ నాయకులు వారికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ప్రభుత్వాల పాలనలో కరెంటుకోసం నరకయాతన పడ్డ రైతులు తెలంగాణ వచ్చిన తరువాత సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చర్యలతో ఆ బాధలను మరిచిపోయారని, హాయిగా వ్యవసా యం చేసుకుంటూ పంటలు పండించుకుంటూ జీవిస్తున్నారన్నారు.
అయితే ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కాం గ్రెస్ పార్టీ నాయకులు అమలు కాని హామీలిస్తూ ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని.. వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ ఇస్తామంటున్న కాంగ్రెస్ పార్టీ కావాలా.. 24 గంటలపాటు విద్యుత్తు ఇచ్చే బీఆర్ఎస్ ప్రభుత్వానికి మద్దతు తెలుపుదామా ప్రజలు విచక్షణతో ఆలోచించాలని సూచించారు. కాంగ్రెస్ మోసపూరిత గ్యారెంటీలను ప్రజలు నమ్మడంలేదన్నారు. సీఎం కేసీఆర్ అన్ని వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నారని.. ప్రతి ఇంటికీ ప్రభుత్వ ఫలాలు అందుతున్నాయన్నారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ కొడంగల్ అభ్యర్థి, ఎమ్మెల్యే నరేందర్రెడ్డి మాట్లాడుతూ ఐదేండ్లలో కొడంగల్ నియోజవకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశానని.. మరోసారి ఆశీర్వదించి గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని ప్రజలకు హామీచ్చారు. కాంగ్రెస్ నాయకులకు ప్రజలు ఎన్నికల సమయంలోనే గుర్తొస్తారని విమర్శించారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన రేవంత్రెడ్డి కొడంగల్కు చేసిందేమీలేదన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ దుద్యాల మండలాధ్యక్షుడు చాంద్పాషా, మండల ఇన్చార్జి కిషన్రావు, పీఏసీఎస్ చైర్మన్ విష్ణువర్ధన్రెడ్డి, ఎల్లమ్మ ఆలయ చైర్మన్ వెంకటేశ్, సర్పంచ్ రామకృష్ణారెడ్డి, పార్టీ నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.
అభివృద్ధినిప్రోత్సహించండి
కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కష్టాలు తప్పవని.. మరోసారి బీఆర్ఎస్ పార్టీని గెలిపించి ప్రగతిని ప్రోత్సహించాలని మంత్రి పట్నం మహేందర్రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని నందిపహాడ్, లక్కయ్యపల్లి, పల్లెర్ల తదితర గ్రామాల్లో ఆయన ప్రచారాన్ని ముమ్మరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ మాటలు నమ్మి మోసపోతే గోస తప్పదని ప్రజలకు హెచ్చరించారు. నిత్యం మీలో ఒకరిగా ఉండే నరేందర్రెడ్డి కావాలా.. గాలి మోటర్లో తిరుగుతూ కొడంగల్ ప్రజలను విస్మరించిన రేవంత్రెడ్డి కావాలో నిర్ణయించుకోవాలన్నారు. బీఆర్ఎస్తోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమన్నారు. కాంగ్రెస్ 6 గ్యారెంటీల పేరుతో ప్రజలను మభ్యపెట్టాలని చూ స్తున్నదని మండిపడ్డారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ డైరెక్టర్ సలీం, మాజీ జడ్పీటీసీ బాల్సింగ్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.