అహింసా మార్గంలో గాంధీజీ బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా ప్రజలను ఏకం చేశారని, ఆయన పోరాట స్ఫూర్తిని కొనసాగించాలని మంత్రి మహేందర్రెడ్డి, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్రెడ్డి, అంజయ్యయాదవ్, కాలె యాదయ్య అన్నారు. సోమవారం గాంధీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటాలకు పూలమాలలేసి నివాళులర్పించారు. జిల్లా వ్యాప్తంగా జయంతిని నిర్వహించారు.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గ బృందం, అక్టోబర్ 2 : గాంధీ కలలుగన్న గ్రామస్వరాజ్యం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా శేరిగూడ గ్రామంలో గాంధీజీ విగ్రహానికి పూలమాలేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..గ్రామాలే దేశానికి పట్టుగొమ్మలని, గ్రామాలు బాగుంటేనే దేశం బాగుంటుందనే నినాదంతో గాంధీ ముందుకెళ్లారని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ యాదగిరి, కౌన్సిలర్లు అల్వాల జ్యోతి పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో సోమవారం జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇబ్రహీంపట్నం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ కృపేశ్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. శేరిగూడలో వైస్ చైర్మన్ యాదగిరి, కౌన్సిలర్లు శ్వేత, సుజాత, మమత, విశాల, మంగ, జ్యోతి, పద్మ, జగన్, పార్టీ మండల అధ్యక్షుడు బుగ్గరాములు, మున్సిపల్ అధ్యక్షుడు వెంకట్రెడ్డి ఆధ్వర్యంలో నివాళులర్పించారు. మంచాల మండలం ఆరుట్లతో పాటు మంచాలలో గాంధీ జయంతిని నిర్వహించారు. యాచారం మండల కేంద్రంలో ఎంపీపీ కొప్పు సుకన్య, జడ్పీటీసీ జంగమ్మ ఆధ్వర్యంలో, ఆదిబట్ల మున్సిపాలిటీతో పాటు తుర్కయాంజాల్, పెద్దఅంబర్పేట, మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు జయంతిని నిర్వహించారు. ఆయా గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించారు.
జాతిపిత ఆదర్శప్రాయుడు
షాద్నగర్టౌన్ : స్వాతంత్య్ర సమరయోధుడు, అహింసావాది, జాతిపిత గాంధీ జయంతిని ప్రజాప్రతినిధులు, నాయకులు ఘనంగా నిర్వహించి నివాళులర్పించారు. షాద్నగర్ మున్సిపాలిటీ గంజ్రోడ్డులోని గాంధీ, లాల్బహదూర్శాస్త్రి విగ్రహాలతో పాటు ఫరూఖ్నగర్నగర్లోని మహాత్మాగాంధీ విగ్రహానికి ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్, వైస్ చైర్మన్ ఎంఎస్ నటరాజ్, కమిషనర్ వెంకన్న, కౌన్సిలర్లతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఫరూఖ్నగర్ మండలం బూర్గుల, దేవునిపల్లి గ్రామాల్లో సర్పంచ్లు అరుణ, రాఘవేందర్గౌడ్, విఠ్యాల గ్రామంలో బీఆర్ఎస్ నాయకుడు చంద్రశేఖర్, కేశంపేట మండలం అల్వాల్ గ్రామంలో సర్పంచ్ శ్రీలత, కొత్తూరులో మున్సిపల్ చైర్మన్ లావణ్య, కొత్తూరు మండలంలో ఎంపీపీ మధుసూదన్రెడ్డి, నందిగామ మండలం వెంకమ్మగూడలో సర్పంచ్ రజనీత, కొందుర్గు, చౌదరిగూడ మండలాల్లో ప్రజాప్రతినిధులు, నాయకులు మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లులర్పించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు కొందూటి మహేశ్వరి, శ్రీనివాస్, నందీశ్వర్, శ్రీనివాస్, అంతయ్య, కో-ఆప్షన్ సభ్యుడు కిశోర్, నాయకులు జూపల్లి శంకర్, యుగేందర్, గోపాల్, శేఖర్, శ్రీనివాస్, నందకిశోర్, రాఘవేందర్, సత్యం, పిన్నమోని గోపాల్ పాల్గొన్నారు.
మహాత్మాగాంధీ అడుగుజాడల్లో నడవాలి
చేవెళ్ల రూరల్ : మహాత్మాగాంధీ అడుగుజాడల్లో ప్రతి ఒకరూ నడవాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మండల పరిధిలో దామరగిద్ద గ్రామంలో సోమవారం మహాత్మా గాంధీ, పండుగల సాయన్న విగ్రహాల ఏర్పాటుకు సోమవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సత్యాగ్రహాలు చేపట్టి శాంతియుతంగా స్వాతంత్య్రాన్ని తీసుకువచ్చిన మహనీయుడు గాంధీ అని కొనియాడారు. పేదల పెన్నిధి పండుగల సాయన్న అని, ఆయన విగ్రహం దామరగిద్ద గ్రామంలో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ విజయలక్ష్మి, గ్రామ సర్పంచ్ మలిపెద్ది వెంకటేశం గుప్తా, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పెద్దోళ్ల ప్రభాకర్, బీఆర్ఎస్ బీసీ సెల్ మండల అధ్యక్షుడు ఎదిరె రాములు, నాయకులు మర్పల్లి కృష్ణారెడ్డి, రమణారెడ్డి పాల్గొన్నారు.
కడ్తాల్ : గాంధీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జడ్పీటీసీ దశరథ్నాయక్, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్గుప్తా అన్నారు. మండల కేంద్రంలో పీఏసీఎస్ చైర్మన్ వెంకటేశ్ ఆధ్వర్యంలో గాంధీ జయంతిని నిర్వహించారు. గాంధీజీ చూపిన బాటలోనే సీఎం కేసీఆర్ నడిచి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించారన్నారు. అంతకుముందు గాంధీజీ విగ్రహానికి నాయకులు క్షీరాభిషేకం చేశారు. అనంతరం పండ్లు, మిఠాయిలు పంచిపెట్టారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు గంప శ్రీను, వైస్ ఎంపీపీ ఆనంద్, సర్పంచ్ లక్ష్మీనర్సింహారెడ్డి, ఎంపీటీసీ శ్రీనివాస్రెడ్డి, ఉప సర్పంచ్ రామకృష్ణ, నాయకులు వీరయ్య, నరేందర్రెడ్డి, భిక్షపతి, రామచంద్రయ్య, గణేశ్గౌడ్ పాల్గొన్నారు.
ఆమనగల్లు : ఆమనగల్లు పట్టణంలో పత్యానాయక్ ఫౌండేషన్, బీఆర్ఎస్ ఆధ్యర్యంలో గాంధీ జయంతిని నిర్వహించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ అనురాధ, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పత్యానాయక్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నిరంజన్గౌడ్, సీనియర్ నాయకులు రామకృష్ణ, రాములు పంతూనాయక్, రమేశ్ యాదయ్య పాల్గొన్నారు.
మాడ్గుల : నల్లచెరువు గ్రామంలో జయంతిని నిర్వహించారు. గాంధీ చిత్రపటానికి నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కృష్ణారెడ్డి, భూతరాజు, రమేశ్, యాదయ్య, రాములు పాల్గొన్నారు.
షాబాద్ : గాంధీజీ ఆశయసాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కో-ఆప్షన్ సభ్యుడు చాంద్పాషా అన్నారు. హైతాబాద్, చందనవెళ్లి, కుమ్మరిగూడ, షాబాద్, బోడంపహాడ్ తదితర ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు గాంధీజీ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళ్లులర్పించారు. కార్యక్రమంలో ఆయా గ్రామా ల సర్పంచులు కొలన్ ప్రభాకర్రెడ్డి, పోనమోని కేతన, సుబ్రహ్మణ్యేశ్వరి, కృష్ణారెడ్డి, ఎంపీటీసీ సరళ, మాజీ సర్పంచ్ దర్శ న్, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ యాదయ్య పాల్గొన్నారు.
చేవెళ్ల రూరల్ : గ్రామాల్లో ప్రజా ప్రతినిధులు, నాయకులు గాంధీ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ముడిమ్యాల్ గ్రామంలో సర్పంచ్ శేరి స్వర్ణలతాదర్శన్ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. దేవునిఎర్రవల్లి గ్రామంలో సర్పంచ్ సామ మాణిక్యరెడ్డి, అంతారం గ్రామంలో సర్పంచ్ సులోచనాఅంజన్ గౌడ్ తదితరులు మహాత్మాగాంధీ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో శేరి శ్రీనివాస్, వంగ శ్రీధర్రెడ్డి, ఎదిరె శ్రీశైలం పాల్గొన్నారు.
మొయినాబాద్ : వివిధ గ్రామాల్లో గాంధీ జయంతిని నిర్వహించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ చంద్రారెడ్డి, ఎంపీటీసీ రవీందర్రెడ్డి, నాయకులు మాణిక్రెడ్డి, శ్రీశైలం, రాజు, దర్శన్, మాణెయ్య, మల్లారెడ్డి, మిట్టు పాల్గొన్నారు.
చేవెళ్లటౌన్ : చేవెళ్ల గ్రామ పంచాయతీ కార్యాలయంలో గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ శైలజ, పీఏసీఎస్ చైర్మన్ వెంకట్రెడ్డి, మాజీ ఎంపీపీ బాల్రాజ్, ఉప సర్పంచ్ గంగి యాదయ్య, వార్డు సభ్యులు మల్లారెడ్డి, మహమ్మద్ గయాసుద్దీన్, యాదమ్మ, పీఏసీఎస్ డైరెక్టర్ సువర్ణ పాల్గొన్నారు.