మర్పల్లి, నవంబర్ 14 : ఈ నెల 16న మర్పల్లిలో రాష్ట్ర మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ రోడ్షో నేపథ్యంలో మంగళవారం మండల కేంద్రంలో హెలిప్యాడ్ ఏర్పాట్లను చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారీ ఎత్తున నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం ఎంసీఎం ఫంక్షన్హాలులో మండల నాయకులతో పలు విషయాలపై చర్చించారు. కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.