కడ్తాల ఆగస్టు1 : టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని శాసనమండలి సభ్యుడు కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల మండలం చరికొండ గ్రామానికి చెందిన పలువురు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్సీ కసిరెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కార్యకర్తలు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని మరింత బలోపేతం చేయాలన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం తగిన నిధులు ఇస్తామని తెలిపారు.
కార్యక్రమంలో సుధాకర్, కుమార్, మహేశ్, కర్ణాకర్, మహేందర్, చెన్నయ్య, సురేశ్, గోపాల్, మల్లేశ్, శ్రీరాములు, రాజు, దుర్గయ్య, వెంకటేశ్, శివ, శంకర్, మహేశ్, హరికృష్ణ, బీష్మాచారి, గౌని లక్ష్మయ్య, వెంకయ్య, మోతిలాల టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.