వికారాబాద్, జూన్ 21 : బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్రెడ్డిపై కాంగ్రెస్ సర్కార్ కక్షపూరితంగా కేసు నమోదు చేయడం దుర్మార్గమని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్ శనివారం ఒక ప్రకటనలో ఖండించారు.
అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేయడమేనా..? మీ పాలన అంటూ మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నాయకులపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలన్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతను తట్టుకోలేక ప్రజల దృష్టిని మళ్లించేందుకు డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతున్నదన్నారు. ఎన్ని నిర్బంధాలు పెట్టినా, కేసులు నమోదు చేసినా, అరెస్టులు చేసినా ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ తరఫున ప్రజల పక్షాన ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు.