వికారాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న ప్రైవేట్ దవాఖానలపై జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎలాంటి గుర్తింపు లేని, అర్హత లేని ప్రైవేట్ దవాఖానలతోపాటు డయాగ్నోస్టిక్ సెంట ర్లు, క్లినిక్లలో ప్రత్యేక వైద్య బృందాలు గత ఐదు రోజులుగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. శుక్రవారం వరకు జిల్లాలోని 139 ప్రైవేట్ దవాఖానలను తనిఖీలు చేసిన అధికారులు తొమ్మిది దవాఖానలను సీజ్ చేశారు. సీజ్ చేసిన దవాఖానల్లో వికారాబాద్ పట్టణానికి చెందినవే ఎక్కువగా ఉన్నాయి.
వికారాబాద్లోని శ్రీఅనంత మల్టీ స్పెషాలిటీ దవాఖాన, మెడిక్యూర్ దవాఖాన, సద్గురు సాయిరాం దవాఖాన, సూర్య డయాగ్నోస్టిక్ సెంటర్, బెన్నెట్ దవాఖా న లు ఉన్నాయి. అదేవిధంగా తాండూరులోని తాం డూరు నర్సింగ్ హోం, స్కానింగ్ సెంటర్, చన్గొముల్లోని వెంకటేశ్ ఫస్ట్ ఎయిడ్ కేంద్రం, చిట్టంపల్లిలోని ఉదయ్కుమార్ ఫస్ట్ ఎయిడ్ కేంద్రాన్ని జిల్లా వైద్యారోగ్య శాఖ బృందాలు సీజ్ చేశాయి. మరోవైపు జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 139 ప్రైవేట్ దవాఖానలను తనిఖీ చేసిన బృం దాలు 31 ప్రైవేట్ దవాఖానలతోపాటు డయాగ్నోస్టిక్ సెం ట ర్లు, ప్రైవేట్ క్లినిక్లకు షోకాజ్ నోటీసులు జారీ చేయడంతోపాటు జారిమానాలను విధించాయి. అదేవిధంగా మరో పది ప్రైవేట్ దవాఖానల్లో అర్హతలేని వైద్యులుండడం, సరైన వసతులు లేకపోవడం, గుర్తింపు లేకుండానే నిర్వహిస్తుండటంతో జరిమానాను విధించారు. అయితే జిల్లావ్యాప్తంగా వైద్యారోగ్యశాఖ బృందాలు ప్రైవేట్ దవాఖానలు, డయాగ్నోస్టిక్ సెంటర్లలో తనిఖీలు నిర్వహిస్తుండటం తో ఎలాంటి అర్హత లేకుండానే ఆర్ఎంపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్లినిక్లతోపాటు పలు డయాగ్నోస్టిక్, స్కానింగ్ సెం టర్లను గత వారం రోజులుగా మూసివేశారు.