మూసాపేట, ఆగస్టు1 : భర్త మందలించాడని భార్య ఇంట్లో నుంచి వెళ్లిపోయిన సంఘటన మేడ్చల్ జిల్లా కూకట్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. ఎస్సై రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం..మూసాపేట చిత్తారమ్మనగర్కు చెందిన గురజాల దుర్గయ్య, భగ్యమ్మ(55) దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
అందరికి వివాహాలు అవడంతో అక్కడే వేరువేరుగా ఉంటూ జీవనం సాగిస్తున్నారు. భగ్యమ్మ ఇంటి ముందు ఉన్న గుడిని రోజు శుభ్రం చేస్తుంది. అదేవిధంగా గత నేల 31వ తేదిన గుడి శుభ్రం చేసే క్రమంలో భార్యభర్తల మధ్య గొడువ జరిగింది.
మనస్తాపానికి గురైన భగ్యమ్మ ఇంటి నుంచి ఎవ్వరికి చెప్పకుండా బయటకు వెళ్లిన ఆమే ఇప్పటికీ తిరిగిరాలేదు. తెలిసిన ప్రాంతాల్లో వెతికినా ఫలితం లేకపోవడంతో బాధితురాలి కుమారుడు శివకుమార్ సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.