మేడ్చల్ మల్కాజిగిరి : దవాఖానలో ఉరి వేసుకొని ఓ నర్సు మృతి చెందిన విషాదకర సంఘటన బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధి, ప్రగతి నగర్లో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు..మహబూబ్నగర్ జిల్లా వనపర్తి మండలం పెద్ద గూడెం తండాకు చెందిన నానవతి మంగ (21) జయశ్రీ వైద్యశాలలో గత మూడు నెలలుగా చేస్తున్నది.
కాగా, సోమవారం ఉదయం ఆరు గంటలకు డ్యూటీకి వెళ్లిన మంగ వైద్యశాలలోని క్లినికల్ ల్యాబ్ లో ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మంగ ఆత్మహత్యకు దవాఖానలోని డాక్టర్ వేధింపులే కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.