కీసర, నవంబర్ 29 : కీసరగుట్ట పరిసర ప్రాంతామంతా శివభక్తులతో కోలాహలంగా మారిపోయింది. కార్తికమాసోత్సవంలో భాగంగా చివరి సోమవారం కావడంతో నగర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో శివభక్తులు కీసరగుట్టకు తరలివచ్చారు. సోమవారం శివుడికి ఇష్టమైన రోజు కావడంతో తెల్లవారుజాము 3.30గంటల నుంచే కీసరగుట్టలో ఆలయం వారు అభిషేకాలను ప్రారంభించారు.
భక్తులు తండోపతండాలుగా కీసరగుట్టకు చేరుకొని స్వామివారి సేవలో పాల్గొన్నారు. గర్భాలయంలో స్వామివారికి తేనే, ఆవుపాలు, పంచామృతం, పంచదారలతో వేదపండితులు ప్రత్యేక అభిషేకాలను నిర్వహించారు. అనంతరం శ్రీ లక్ష్మీనర్సింహస్వామివారిని, కాశీవిశ్వేరాలయంను, శ్రీ నాగదేవత ఆలయాలను దర్శించుకున్నారు.