కేపీహెచ్బీ కాలనీ, జూన్ 16 : అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కేపీహెచ్బీ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని కృష్ణా జిల్లా కేదారి గ్రామానికి చెందిన జంగం సాయిశ్రీనివాస్ (35) భార్య ఇద్దరు పిల్లలతో నగరంలో రామ్నరేశ్నగర్లో నివసిస్తున్నారు.
బతుకుదెరువు కోసం పెయింటింగ్ పనులు చేస్తుండగా కొద్ది రోజుల క్రితం కింద పడిపోయి వెన్నెముకకు తీవ్ర గాయాలయ్యాయి. చిన్నచిన్న పనులు చేస్తున్న అతడికి నొప్పి తీవ్రం కావడంతో భరించలేని సాయిశ్రీనివాస్ బుధవారం రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.