కీసర, మార్చి 21 : పాము కాటుకు 8వ తరగతి విద్యార్థి మృతి చెందిన సంఘటన కీసర పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కీసర సీఐ రఘువీరారెడ్డి కథనం ప్రకారం ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం కొమశెట్టిపల్లి గ్రామానికి చెందిన గొల్ల రమేశ్ కుమారుడు శివశంకర్(13) కీసర మండలం భోగారంలోని మహాత్మజ్యోతిబాపులే బీసీ వెల్ఫేర్ హాస్టల్లో 8వ తరగతి చదువుతున్నాడు.
హాస్టల్లో ఉన్న శివశంకర్కు ఈనెల 20వ తేదీన ప్రమాదవశాత్తు పాము కరిచింది. ఈ విషయం తెలుసుకున్న పాఠశాల సిబ్బంది శివశంకర్ను నగరంలోని కాకతీయ దవాఖానకు తరలించారు. సోమవారం చికిత్స పొందుతూ ఆ విద్యార్థి మృతి చెందిన్నట్లు దవాఖాన డ్యూటీ డాక్టర్ నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించారు. పోలీసులు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.