పీర్జాదిగూడ: శ్రీ అండాల్ తిరు నక్షత్రం సందర్బంగా పీర్జాదిగూడ నగరపాలక సంస్థ పరిధిలోని పర్వతాపూర్ సత్యనారాయణపురంలోని శ్రీశ్రీశ్రీ బ్రహ్మతంత్ర స్వతంత్ర పరకాల మఠంలో బుధవారం మఠం ప్రతినిధుల ఆధ్వర్యంలో పత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మఠంలో కొలువైన శ్రీ లక్ష్మీహయిగ్రీవస్వామి మూల మూర్తులకు ప్రత్యేకపూజలతో పాటు గోదాదేవి, మహాలక్ష్మీ అమ్మవార్లకు విశేష తిరుమంజనం, అర్చన తదితర కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మఠం ప్రతినిధులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పూజా కార్యక్రమాలు నిర్వహించారు.