కుత్బుల్లాపూర్, ఆగస్టు : తెలంగాణ ఉద్యమస్పూర్తి ప్రదాత, ప్రజల్లో ఉద్యమ చైతన్యాన్ని నింపిన సిద్ధాంత కర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి వేడుకలు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ నివాసంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జయశంకర్ సార్ చిత్రపటానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి ఘనంగా నివాళులుఅర్పించారు. కార్యక్రమంలో నేతలు పుప్పాల భాస్కర్, చౌడ శ్రీనివాస్రావు, శ్రీకాంత్,సాయి,శ్యాంకుమార్ తదితరులు పాల్గొన్నారు.
మంత్రులతో కలిసి నివాళులు అర్పించిన ఎమ్మెల్సీ శంభీపూర్రాజు…
కూకట్పల్లి నియోజకర్గం, ఫతేనగర్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రులు కల్వకుంట్ల తారకరామారావు(కేటీఆర్), చామకూర మల్లారెడ్డితో కలిసి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు శంభీపూర్రాజు ఆచార్య జయశంకర్ సార్ చిత్ర పటానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవరం క్రిష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్రావు తదితరులు పాల్గొన్నారు.