జీడిమెట్ల, ఏప్రిల్ 19 : సెల్ ఫోన్కు వచ్చిన మెసేజ్ను క్లిక్ చేసిన ఓ ప్రైవేటు ఉద్యోగి సైబర్ నేరాగాళ్ల చేతిలో పడి డబ్బులు పొగోట్టుకున్న సంఘటన జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ కె.బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం..షాపూర్నగర్ ఎన్ఎల్బినగర్కు చెందిన అక్కినేని సత్తిబాబు ఓ ప్రైవేటు సంస్థలో పని చేస్తున్నాడు. ఈ నెల 11న అతని ఫోన్కు పాన్కార్డు అప్డెట్ చేసుకోవాలంటూ మేసేజ్ వచ్చింది.
వెంటనే సదరు మేసేజ్ను నమ్మిన సత్తిబాబు వచ్చిన లింక్ను క్లిక్ చేయగా ఆన్లైన్ బ్యాంకింగ్ సైట్ ఒపెన్ అయ్యింది.
అందులో అడిగినట్లుగా అతడు యూసర్ ఐడీ, పాస్వర్డ్ను క్లిక్ చేయగా తన సెల్ఫోన్కు ఓటీపీ నంబర్ వచ్చింది. అనంతరం ఓటీపీని ఎంటర్ చేయగానే సత్తిబాబుకు బ్యాంక్ ఖాతా నుంచి రూ.11,500 కట్ అయ్యాయి. దీంతో బాధితుడు సత్తిబాబు మోసపోయానని గ్రహించి జీడిమెట్ల పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.