మేడ్చల్ మల్కాజిగిరి :కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు సత్వర చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ హామి ఇచ్చారు. శుక్రవారం నియోజకవర్గానికి చెందిన ఆయా కాలనీల సంక్షేమ సంఘాల ప్రతినిధులు, ప్రజలు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ను మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రాలను అందించారు. స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారుల దృష్టికి ఫోన్లైన్ ద్వారా తీసుకెళ్లి సకాలంలో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలను కేటాయింపు విషయంపై ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరుతూ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ను జర్నలిస్టు సంఘాల నేతలు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం పేట్ బషీరాబాద్లోని తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలుసుకున్న నేతలు జర్నలిస్టుల సమస్యలపై వివరించారు.
ఈ మేరకు స్పందించిన ఎమ్మెల్యే అసెంబ్లీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం మేడ్చల్ జిల్లా అధ్యక్షులు జి.బాలరాజు, కుత్బుల్లాపూర్ అధ్యక్షులు కే.శ్రీనివాస్, సాయిబాబా, దయాకర్రెడ్డి, కే.వెంకట్, డి.రామస్వామి, లక్ష్మణ్ తదితరులు ఉన్నారు.