జీడిమెట్ల, ఏప్రిల్ 28: క్రీడలు మానసిక దృఢత్వాన్ని పెంపొందిస్తాయని బీఆర్ఎస్ పార్టీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ అన్నారు. సోమవారం సుభాష్ నగర్ డివిజన్లో సుమారు రూ.2.90 కోట్ల వ్యయంతో నిర్మించిన ఇండోర్ షటిల్ కోర్ట్స్ క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలు మొబైల్ ఫోన్లకు పరిమితం కాకుండా క్రీడల్లో రాణించేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి, శరీర దారుఢ్యానికి ఎంతగానో దోహదపడతాయన్నారు.
ఈ కార్యక్రమంలో సుభాష్ నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి, మేడ్చల్ జిల్లా ఫిషరీస్ కో-ఆపరేటివ్ చైర్మన్ మన్నె రాజు, డివిజన్ అధ్యక్షుడు పోలే శ్రీకాంత్, సీనియర్ నాయకులు గుబ్బల లక్ష్మీనారాయణ, శేషా చారి, దుర్గా రావు, భాస్కర్ రెడ్డి, హరిబాబు యాదవ్, నర్సింగ్ రావు, శ్యామ్, గోపాల్ రెడ్డి, వెంకటేశ్వర రావు, పద్మ, అనిల్, శ్రీదేవి, సరిత, ఉమ, స్వర్ణ, ఎస్.ఆర్.నాయక్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు సదానంద చారి, ప్రభాకర్, జనప్రియ భాస్కర్ రెడ్డి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.