దుండిగల్,మార్చి28 : దుండిగల్ మున్సిపాలిటీ పరిధి బహదూర్పల్లిలో నూతనంగా నిర్మించనున్న శ్రీ విజయగణపతి ఆలయ నిర్మాణపనులకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ సోమవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మట్లాడుతూ.. దైవచింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. తద్వారా మానవుడు నిస్వార్ధసేవకుడిగా మారే అవకాశం ఉంటుందన్నారు. నియోజకవర్గం పరిధిలోని ఆలయాల అభివృద్ధికి ఎల్లప్పుడు తన సహకారం ఉంటుందన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.