మల్కాజిగిరి, జూలై 19 : ప్రజల సమస్యలు పరిష్కరించేవరకు అవిశ్రంతంగా పోరాటం చేస్తామని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి అన్నారు. ఓల్డ్ నేరేడ్మెట్ గౌడ సంఘానికి చెందిన శ్మశానవాటిక స్థలం సమస్య పరిష్కరించిన ఎమ్మెల్యేను ఆదివారం గౌడ సంఘం ప్రతినిధులు కలిశారు. ఈమేరకు మాజీ కార్పొరేటర్ నిరుగొండ జగదీష్గౌడ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను క్యాంపు కార్యాలయంలో కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 15 ఏండ్లుగా పోరాటం చేస్తున్నామని, కోర్టు వివాదానికి తెరపడిందని తెలిపారు. గౌడ సంఘంనకు అనుకూలంగా తీర్పు వచ్చిందని, ఈ పత్రాలను జోనల్ కమిషనర్కు అందజేశామని, ఈ మేరకు జడ్సీ ప్రొసీడింగ్ జారీ చేశారని పేర్కొన్నారు.
గౌడ సంఘానికి అనుకూలంగా తీర్పు రావడంలో శ్రమించిన జగదీష్గౌడ్కు, సలహలు, సూచనలతోపాటు న్యాయం జరిగేవరకు తమ వెన్నెంటే నిలిచిన ఎమ్మెల్యేకు రుణపడి ఉంటామన్నారు. ఈ సందర్భంగా 100 గౌడ సంఘం కుటుంబాలు వారిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘం పెద్దలు టీవీ.నరేందర్, ఈశ్వర్, పవన్, శ్రీకాంత్, సాయి, విశ్వనాథ్, అభిషేక్, జహంగీర్, గిరి, గంగాధర్, వినోద్, నేతలు జనార్ధన్, కోటేశ్వర్, శ్రీకాంత్, శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.