మల్కాజిగిరి, ఆగస్టు: బస్తీదవాఖనాలోనూ ప్రజల సౌకర్యార్థం కరోనా వాక్సినేషన్ సెంటర్ను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ప్రజలు ఈ సెంటర్లను సద్వినియోగం చేసుకోవాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈస్ట్ ఆనంద్బాగ్ డివిజన్ పరిధిలోని బీజేఆర్ నగర్ బస్తీ దవాఖానాలో పై అంతస్థులో కరోనా వాక్సిన్ సెంటర్ను శనివారం స్థానిక కార్పొరేటర్ వై. ప్రేంకుమార్తో కలిసి లాంచనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఆయా ప్రాంతాల్లో వారివారి సౌకర్యాల కోసం పలు వాక్సిన్ సెంటర్లను ఏర్పాటు చేశామని ప్రజలు ఎక్కడి వారు అక్కడే వాక్సిన్లు వేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి జీఎన్వీ సతీష్కుమార్, గుండ నిరంజన్, బాబు, సత్యనారాయణ, సంపత్రావు, శంకర్రావు, నవీన్యాదవ్, బిక్షపతి, అశోక్, కిషోర్, సంతోష్, మోహన్రెడ్డి, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.