బోడుప్పల్, ఆగస్టు16: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విధి నిర్వహణలో ఉత్తమ సేవలందించిన బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులకు పురస్కారాలు దక్కాయి. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్గా పనిచేస్తున్న ఎల్ కురుమయ్య, అలాగే పారిశుధ్య విభాగానికి చెందిన యు.అంజయ్యకు మంత్రి మల్లారెడ్డి, సీపీ మహేశ్ భగవత్ ఆదివారం పురస్కారాలు అందజేశారు. అవార్డు అందుకున్న వారిని సోమవారం మేయర్ బుచ్చిరెడ్డి, కమిషనర్ బి.శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ లక్ష్మీరవిగౌడ్, స్దానిక కార్పొరేటర్లు, నాయకులు మంద సంజీవరెడ్డి, ఉద్యోగులు అభినందించారు.